Chiranjeevi: పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’…పవన్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్!

తాజాగా వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న 'విశ్వంభర' చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరిగినా పిఠాపురం లోనే జరగాలని నిర్మాతలకు చెప్పాడట. వసిష్ఠ దర్శకత్వం లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ 'విశ్వంభర' చిత్రం పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Written By: Gopi, Updated On : August 21, 2024 3:06 pm

Chiranjeevi(5)

Follow us on

Chiranjeevi: పిఠాపురం..ఏడాది క్రితం ఈ నియోజకవర్గం కేవలం 175 నియోజకవర్గాలలో ఒకటి మాత్రమే. కానీ ఇప్పుడు పిఠాపురం అంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఒక బ్రాండ్. ఎందుకంటే ఇక్కడి నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి 70 వేలకు పైగా మెజారిటీ తో గెలవడమే కాకుండా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అప్పటి నుండి ఈ ప్రాంతం పేరు మారుమోగిపోయింది. ప్రతి ఒక్కరూ మేము ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అని చెప్పుకోవడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారిపోయింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురం కోసం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల శ్రేయస్సు కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయాలు కారణంగా పవన్ కళ్యాణ్ కి రోజురోజుకి ఎంత మంచి పేరు వస్తుందో, ఆయనతో పాటుగా పిఠాపురం కి కూడా అంతే మంచి పేరు వస్తుంది. ఇప్పుడు సినిమా షూటింగ్స్ కూడా పిఠాపురం లో పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు సినీ నిర్మాతలు.

తాజాగా వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జరిగినా పిఠాపురం లోనే జరగాలని నిర్మాతలకు చెప్పాడట. వసిష్ఠ దర్శకత్వం లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ‘విశ్వంభర’ చిత్రం పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిపోదగ్గ చిత్రం గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తో గతం లో ఆమె ‘స్టాలిన్’ అనే చిత్రం చేసింది. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు మెగాస్టార్ తో కలిసి ఆమె నటిస్తుంది. రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే పిఠాపురం లో ‘విశ్వంభర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే ఆలోచన ఊహిస్తుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

పిఠాపురం లో ఈవెంట్ అంటున్నారు కాబట్టి, కచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నాడు అన్నమాట. అన్నాదమ్ములిద్దరినీ ఒకే వేదిక మీద చూసి చాలా కాలమే అయ్యింది. కుటుంబ సమేతంగా కలిసిన సందర్భాలు ఇటీవల కాలంలో చాలానే ఉన్నాయి కానీ, అభిమానుల సమక్షం లో వీళ్లిద్దరు చివరిసారిగా ‘సై రా నరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు మెగాస్టార్ పక్కన ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఈ ఈవెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.