ఆగం అవుతున్న ఫ్యాన్స్.. మెగాస్టార్ కు పట్టదా?

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమాగణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ కు.. మెగా హీరోలకు మధ్య అనుబంధం ఉంటుంది. అభిమానులు కోరుకునే పాత్రల్లో.. సినిమాల్లో నటించేందుకు మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఆయన ఎక్కువగా మాస్ సినిమాలనే చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నిత్యం అభిమానులతో టచ్లో ఉంటూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే మెగాస్టార్ ఒక్క విషయంలో మాత్రం వారి మాటను పెడచెవిన పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. Also Read: దీపావళికి పేలనున్న ‘లక్ష్మీబాంబ్’ […]

Written By: NARESH, Updated On : September 17, 2020 5:12 pm

megastar chiranjeevi

Follow us on


మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమాగణం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యాన్స్ కు.. మెగా హీరోలకు మధ్య అనుబంధం ఉంటుంది. అభిమానులు కోరుకునే పాత్రల్లో.. సినిమాల్లో నటించేందుకు మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ఆయన ఎక్కువగా మాస్ సినిమాలనే చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నిత్యం అభిమానులతో టచ్లో ఉంటూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే మెగాస్టార్ ఒక్క విషయంలో మాత్రం వారి మాటను పెడచెవిన పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read: దీపావళికి పేలనున్న ‘లక్ష్మీబాంబ్’

చిరంజీవి రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారాడు. ‘ఖైదీ-150’తో బాస్ ఈజ్ బ్యాక్ అని మెగాస్టార్ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘సైరా’ మూవీలో నటించి మెప్పించారు. ఈ సినిమాకు ఆశించిన కలెక్షన్లు రాకపోయినా.. సైరా నర్సింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణం పోశారు. ఈ మూవీలో ఆయన చూపిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

తాజాగా చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని తెరక్కిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రాంచరణ్ ఇందులో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. చిరంజీవి-రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ అత్రుతగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగు నిలిచిపోగా చిరంజీవి తదుపరి మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

భారీ బడ్జెట్ సినిమాలు తీసే మోహర్ రమేష్ కే ఇండస్ట్రీలో మంచి గుర్తింపే ఉంది. ఆయన తెరకెక్కించిన కంత్రి.. షోడో మూవీలు ప్లాపు కావడంతో మెహర్ రమేష్ చాలారోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇలాంటి దర్శకుడితో మెగాస్టార్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిని ఫ్యాన్స్ గాసిప్ గా కొట్టిపాడేశారు. మోహర్ రమేష్ మెగాస్టార్ తో మూవీని చేయబోతున్నట్లు ఇటీవల పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ ధృవీకరించడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.

Also Read: డ్రగ్స్ కేసులో కథనాలపై ఢిల్లీ హైకోర్టుకు రకూల్

అతడితో సినిమా చేయద్దంటూ మెగాస్టార్ కు ఫ్యాన్స్ విన్నవిస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదట. మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘వేదాళం’ మూవీని మెహర్ రమేష్ తెలుగులో రీమేక్ చేబోతున్నాడట. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రీప్ట్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ షూటింగును ప్రారంభించేందుకు దర్శకుడు సన్నహాలు చేసుకుంటున్నాడట. తనకు రాకరాక వచ్చిన ఈ ఛాన్స్ సద్వినియోగం చేసుకొని మళ్లీ ఫామ్ లోకి రావాలని మెహన్ రమేష్ భావిస్తున్నాడు. ఈ సారైనా మెహర్ రమేష్ హిట్టు కొట్టి ట్రాకులోకి వస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!