Homeఎంటర్టైన్మెంట్OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న అదిరిపోయే సినిమా.. ఎక్కడ చూడొచ్చు అంటే!

OTT release: ఓటీటీలోకి వచ్చేస్తున్న అదిరిపోయే సినిమా.. ఎక్కడ చూడొచ్చు అంటే!

OTT release: 70 ఏళ్ల వయసులో అద్భుతమైన చిత్రాలు చేస్తున్నారు. మమ్ముట్టి. ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భ్రమయుగం. ఈ మలయాళ చిత్రం తెలుగులో కూడా ఆదరణ దక్కించుకుంది. భ్రమయుగం పీరియాడిక్ డార్క్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రూ. 27 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే రూ. 55 కోట్లకు పైగా వసూలు చేసింది. రాహుల్ సదాశివన్ భ్రమయుగం చిత్రాన్ని ఒక డిఫరెంట్ సబ్జెక్టు తో తెరకెక్కించాడు. భ్రమయుగం మూవీ ఫిబ్రవరి 15న విడుదలైంది.

ఈ క్రేజీ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. భ్రమయుగం ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ సోనీలివ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తుంది. భ్రమయుగం మార్చి 15 నుండి స్ట్రీమ్ కానున్నట్లు సమాచారం. మమ్ముట్టి అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ అద్భుత చిత్రాన్ని బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేయవచ్చు.

మమ్ముట్టితో పాటు అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్ కీలక రోల్స్ చేశారు. ఈ మూవీలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఊహించని మలుపులతో సాగుతుంది. ప్రేక్షకులు థియేటర్స్ లో ఎంతగానో ఎంజాయ్ చేసిన చిత్రం ఓటీటీలోకి వస్తుంది. భ్రమయుగం కథ విషయానికి వస్తే… 17వ శతాబ్దంలో పోర్చుగీసు సేనలు తక్కువ కులం వారిని బానిసలుగా అమ్మి వేస్తూ ఉంటారు. వారి బారి నుండి తప్పించుకోవడానికి తేవన్(అర్జున్ అశోకన్) అడవిలోకి పారిపోతాడు.

అక్కడ ఒక పాడుబడ్డ బంగ్లా ఉంటుంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు యజమాని కొడుమోన్ పోటీ(మమ్ముట్టి) మరొకడు వంటవాడు(సిద్దార్థ్ భరతన్). కొడుమోన్ పొట్టి నుండి తేవాన్ కి మొదట్లో మంచి ఆతిధ్యం దొరుకుతుంది. అయితే ఆ ఇంటి వెనుక సమాధులు ఉండటం గమనించిన తేవాన్ ఆందోళనకు గురి అవుతాడు. ఆ ఇంట్లో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అయితే కొడుమోన్ పొట్టి తన తాంత్రిక విద్యలతో తేవాన్ ని పారిపోకుండా అవుతుంటాడు. మరి తేవాన్ తప్పించుకున్నాడా? అసలు కొడుమోన్ పొట్టి ఎవరు? అనేది అసలు కథ…

Exit mobile version