Mahesh Babu next movie Director: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాయి. రాజకుమారుడు సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం రాజమౌళితో వారణాసి అనే సినిమా చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతూ వచ్చాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఇంతకు ముందు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు వారణాసి సినిమాతో మరో మెట్టు పైకెక్కలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికి గల కారణమేంటంటే ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుండటం విశేషం…ఈ సినిమాతోనే కాకుండా ఆయన తన తదుపరి సినిమాల విషయంలో కూడా చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తను నెక్స్ట్ మూవీ ఎవరితో చేయాలనే విషయంలో ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.
అందులో ఒకరు సందీప్ రెడ్డివంగా కాగా, మరొకరు ప్రశాంత్ నీల్ ఇంకొకరు రిషబ్ శెట్టి కావడం విశేషం… వీళ్ళ ముగ్గురితో అతను ట్రావెల్ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ ముగ్గురు కూడా తనకి కథలను వినిపించారట. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ ముగ్గురిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు. తన తదుపరి సినిమా సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకి భారీ గుర్తింపైతే ఉంటుంది.
ఇక వారణాసి సినిమా కనుక 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడితే మాత్రం మహేష్ బాబు సినిమాకి హాలీవుడ్ లో కూడా విపరీతమైన గిరాకీ పెరుగుతుంది. కాబట్టి తనతో నెక్స్ట్ సినిమా చేసే దర్శకుడు చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన మార్కెట్ విపరీతంగా పెరగడమే కాకుండా ముందు సినిమాతో తర్వాత సినిమాను పోల్చి చూస్తారు.
కాబట్టి వారణాసి సినిమాను మించిన కథతో మూవీ రావాలి అలా వచ్చినప్పుడే మహేష్ బాబు సూపర్ సక్సెస్ ని సాధిస్తాడు. లేకపోతే మాత్రం మరోసారి డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. అందుకే ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఏ దర్శకుడిని ఎంచుకోవాలి అనే విషయంలో ఇంకా క్లారిటి రాకపోవడంతో ఈ ముగ్గురిని హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది…
