Jai Hanuman Movie: మన టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ ని సృష్టించిన చిత్రాల్లో ఒకటి ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తేజ సజ్జ హీరో గా నటించిన ఈ చిత్రానికి 2024 సంక్రాంతి కానుకగా విడుదలై , ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం ‘ చిత్రాన్ని సైతం డామినేట్ చేసి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది అనే విషయం , మొదటి భాగం క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశంతోనే చెప్పుకొచ్చారు డైరెక్టర్. ‘జై హనుమాన్’ పేరుతో రీసెంట్ గానే మొదలైన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 20 రోజుల భారీ షెడ్యూల్ ని పూర్తి చేశారట. ఈ షెడ్యూల్ లో ఆంజనేయ స్వామి పాత్ర పోషిస్తున్న రిషబ్ శెట్టి తో పాటు, విలన్ గా నటిస్తున్న దగ్గుబాటి రానా కూడా పాల్గొన్నారు. వీళ్లిద్దరి మధ్య కొన్ని వీరోచిత సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారట. ఇకపోతే ఈ చిత్రం లో ‘ధురంధర్’ ఫేమ్ అక్షయ్ ఖన్నా శుక్రాచార్య పాత్రలో కనిపించబోతున్నారట, ఆయనకు సంబంధించిన సన్నివేశాలు తదుపరి షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. రీసెంట్ గానే ‘హనుమాన్ ‘ చిత్రాన్ని 3D వెర్షన్ లోకి మార్చి భారీ లెవెల్ లో రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది , దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు , ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. మన ఇండియన్ మూవీ లవర్స్ హనుమాన్ ని ఒక సూపర్ హీరో గా చూస్తారు.
ఆయన్ని వెండితెర పై పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి భాగం లో ‘హనుమాన్’ విజువల్స్ కేవలం గ్లింప్స్ లాగా చూపిస్తేనే థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చింది. అలాంటిది ‘హనుమాన్’ ని ఫుల్ లెంగ్ స్క్రీన్ టైం లో చూపిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని అద్భుతాలు క్రియేట్ అవుతాయో వచ్చే ఏడాది మనమంతా చూడబోతున్నాము. ఇకపోతే ‘హనుమాన్’ పాత్రకు రిషబ్ శెట్టి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. ఆయన ఎంత గొప్ప నటుడు అనేది ఇప్పటికే ‘కాంతారా’ సిరీస్ తో రుజువు అయ్యింది. ఇక ఈ ‘జై హనుమాన్’ చిత్రం లో ఎంత అద్భుతంగా నటించబోతున్నారో చూడాలి.

