2019 మార్చ్ 28 న విడుదలైన మళయాళ చిత్రం `లూసిఫెర్’ మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే మళయాళ సినీ చరిత్రలో అల్ టైం హిట్ గా నిలిచింది. మన తెలుగు తో పోల్చుకొంటే చాలా చిన్న ఫిలిం మార్కెట్ అయిన మల్లు వుడ్ లో లూసియర్ చిత్రం 200 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ చిత్రం ద్వారా మళయాళ హీరో పృథ్విరాజ్ డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తి అద్భుత విజయాన్ని సాధించాడు. అలాంటి అల్ టైం హిట్ సినిమాని రీమేక్ చేయడానికి అన్న భాషల నిర్మాతలు, ,హీరోలు ఉవిళ్ళూరారు. ఇక తెలుగు వరకు వస్తే `లూసిఫెర్ ` చిత్రం యొక్క రీమేక్ హక్కుల్ని మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ కొనుగోలు చేసాడు..
`లూసిఫెర్’ రీమేక్ హక్కుల్ని తీసుకొన్న చెర్రీ ఈ చిత్రాన్నితన తండ్రి అయిన మెగా స్టార్ చిరంజీవి తో పునర్ నిర్మాణం చేసేందుకు రెడీ అవుతున్నాడు.` సాహో ` ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రీమేక్ అవుతున్న లూసిఫెర్ చిత్రం లో మెగా స్టార్ చిరంజీవి సూచనల మేరకు పలు మార్పులు చేర్పులు జరుగు తున్నాయి.
మలయాళం లో సీరియస్ పొలిటికల్ డ్రామా గా సాగే ఈ చిత్రానికి తెలుగులో కొంత ఎంటర్టైన్మెంట్ జోడించాలని అనుకొంటున్నారు. అలాగే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ కి జోడీ ఉండదు. కానీ తెలుగులో చిరంజీవికి హీరోయిన్ లేకుండా ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారో అన్న సంశయం తో రెండు ఐటెం సాంగ్స్ పెట్టి ఇద్దరు నటీమణుల్ని తెరమీద చూపాలను కొంటున్నారు. అలాగే ఈ చిత్రం లో కీలక మైన హీరో తమ్ముడి పాత్ర ని కూడా ఇంప్రూవ్ చేయమని చిరంజీవి కోరాడట ఆ క్రమం లో తమ్ముడి పాత్ర కోసం మెగా ఫామిలీ మెంబెర్ అయిన పవన్ కళ్యాణ్ ని ఎన్నిక చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు .