Mahesh babu: మహేశ్బాబు నుంచి సినిమావస్తోందంటే చాలు వారి ఫ్యాన్స్కు అదో పండగ. ఇక జక్కన్న రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడంటే.. అది ఏదో వండర్స్నే క్రియేట్ చేస్తుందని అనుకుంటారు. అదే వీరిద్దరూ కలిసి ఓ సినిమా తీస్తే.. అవును మీరు విన్నది నిజమే.. దర్శకుడు రాజమౌళి- సూపర్స్టార్ మహేశ్ కాంబినేషన్లో ఓ క్రేజీ సినిమా పట్టాలెక్కనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

ఈ సినిమాకు ఇప్పటి వరకు తెలుగులో ఎప్పుడూ తీయని కొత్త కథతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ సినిమా పూర్తికాగానే.. మహేశ్ సినిమాపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఓ క్లారిటీ రానున్నట్లు టాక్.
కాగా, ఇప్పటి వరకు టైటిల్ కూడా ప్రకటించని ఈ సినిమాకు సబంధించి రోజుకో కొత్త వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సమాచారం ప్రకారం.. మహేశ్- రాజమౌళి కాంబోలో రానున్న ఈ సినిమాలో సమంతను హరోయిన్గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంతతో కలిసి మహేశ్ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే మరోసారి వీరిని కలిపి హిట్ కొట్టేందుకు జక్కన్న సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నసంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.