https://oktelugu.com/

MAA Election: మేము చేసింది తప్పనుకున్నా ఓకే : శ్రీకాంత్​

MAA Election: సుదీర్ఘ చర్చ అనంతరం ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​ సభ్యులు మీడియా సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు. ఈ సంధర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన సభ్యులందరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.  ఎలక్షన్స్​లో అవకతవకలు జరిగాయని, రౌడీయిజం చేశారని పేర్కొన్నారు ప్రకాశ్​రాజ్​ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్​ మాట్లాడుతూ… విష్ణు తమ్ముడు లాండివాడని అన్నారు. నరేశ్ మా ఎలక్షన్స్​ను వెనకుండి నడిపించాడని చాలా బాగా అర్థమవుతోందని తెలిపారు. ఒకే ప్యానెల్​ […]

Written By: , Updated On : October 12, 2021 / 05:58 PM IST
Follow us on

MAA Election: సుదీర్ఘ చర్చ అనంతరం ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​ సభ్యులు మీడియా సమావేశంలో అనేక విషయాలు వెల్లడించారు. ఈ సంధర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన సభ్యులందరూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.  ఎలక్షన్స్​లో అవకతవకలు జరిగాయని, రౌడీయిజం చేశారని పేర్కొన్నారు ప్రకాశ్​రాజ్​ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే హీరో శ్రీకాంత్​ మాట్లాడుతూ… విష్ణు తమ్ముడు లాండివాడని అన్నారు. నరేశ్ మా ఎలక్షన్స్​ను వెనకుండి నడిపించాడని చాలా బాగా అర్థమవుతోందని తెలిపారు.

maa-election-hero-srikanth-respond-about-how-held-on-maa-elections

ఒకే ప్యానెల్​ సభ్యులు అధికారంలో ఉంటే బాగుంటుందని భావించి.. తమ సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు వివరించారు. మేము తప్పు చేశాని అనుకున్నా ఫర్వాలేదని శ్రీకాంత్​ అన్నారు. విష్ణు మ్యానుఫెస్టోకు ఎలాంటి ఇబ్బంతి కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. తమని నమ్మి గెలిపించిన సభ్యులందరికి క్షమాపనలు కోరుతున్నట్లు శ్రీకాంత్​ తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో నైనా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు శ్రీకాంత్​.

అదే విధంగా బెనర్జీ , ఉత్తేజ్ లను తీవ్ర పద జాలంతో నరేశ్ ధూషించారని … బెనర్జీ పై మోహన్ బాబు ప్రవర్తించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బెనర్జీ , ఉత్తేజ్ కంటతడి పెట్టుకోడవం  అందర్నీ కలిచివేసింది.

‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పోటీపడి ప్రకాశ్‌రాజ్‌ ఓడిపపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా…  8 మంది ప్రకాశ్‌రాజ్‌ అభ్యర్థులు గెలుపొందారు.  ఇటీవల ప్రాంతీయవాదం, జాతీయ వాదం నేపథ్యంలోనే ఈ ఎన్నికలు సాగాయని పేర్కొంటూ ప్రకాశ్​ రాజ్… విష్ణు గెలుపును స్వాగతించినట్లు తెలిపారు.