Samantha: సంతోషంగా ఉన్న సామ్.. దీనికి కారణం ఎవరో తెలుసా?

Samantha విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా కష్టపడింది ఈ బ్యూటీ. దేశాలన్నీ తిరుగుతూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంది.

Written By: Swathi, Updated On : February 14, 2024 11:35 am
Follow us on

Samantha: సమంత పేరు చెప్పగానే ప్రస్తుతం మయోసైటిస్, విడాకులు వంటి సాడ్ న్యూస్ మాత్రమే గుర్తు వస్తుంది. అయ్యో సామ్ ఎంత కష్టం వచ్చింది. చలాకీగా ఉండే నీకు ఇలాంటి కష్టం రావడం ఏంటి సామ్ అని అనుకుంటున్నారు అభిమానులు. కానీ ప్రస్తుతం సామ్ చాలా హ్యాపీగా ఉందట. ఏంటి సమంత హ్యాపీగా ఉందా అని విస్తుపోకండి తనే ఆ విషయం గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇంతకీ ఏమందంటే…

విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి చాలా కష్టపడింది ఈ బ్యూటీ. దేశాలన్నీ తిరుగుతూ తన ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంది. ఇందుకోసం ఏకంగా సినిమాలకు వన్ ఇయర్ బ్రేక్ కూడా ఇచ్చేసింది. మొత్తం మీద ఈ బ్యూటీ కోలుకోవడంతో ఆమె అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. మా సామ్ కోలుకుంది.. ఇక సినిమాల్లోకి కూడా రాబోతుంది అంటూ వెయిట్ చేస్తున్నారు.

త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టబోతుంది సమంత. ఇక రీసెంట్ గా తన బాలాన్యి గుర్తు చేసుసుకుంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. ఈ అమ్మడు తన బాల్యంలో అకడమిక్ సిలబస్ కంటే ఎక్కువ ఇతర బుక్స్ ను చదివేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. బుక్స్ చదవడం మొదలు పెడితే తనను తాను మర్చిపోతుందట. ఏ సబ్జెక్ట్ లో అయినా పరిశోధన చేయడం, లీనం అవడం తనకు చాలా ఇష్టమట.

తిరిగి మళ్లీ ఇదే అలవాటు చేసుకుందట సామ్. మళ్లీ చదువుతున్నాను.. ఎన్నో ఏళ్ల తర్వాత నా మనసు ఉప్పొంగుతుంది. నోట్ బుక్ లు నిండిపోతున్నాయి. త్వరలోనే మీతో ఆ గుడ్ న్యూస్ పంచుకుంటాను అంటూ సమంత చెప్పుకొచ్చింది. సమంత వారం రోజుల్లో హెల్త్ పాడ్ తో అభిమానులకు సప్రైజ్ ఇవ్వబోతుందంటూ సమాచారం. ఇందులో ఆరోగ్య సూత్రాలు-నియమాలు-ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు తన వంతు సహాయం చేయబోతుందట. ఇలా ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.