Guntur Karam: గుంటూరు కారం మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

హీరోయిన్ పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దానికి అనేక కారణాలు వినిపించాయి. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది.

Written By: NARESH, Updated On : January 4, 2024 5:35 pm

Guntur Karam

Follow us on

Guntur Karam: చిత్ర పరిశ్రమలో చాలా విషయాలు అనుకున్నట్లు జరగవు. అప్పటికప్పుడే సమీకరణాలు మారిపోతూ ఉంటాయి. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ విషయంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరిగాయి. షూటింగ్ మొదలయ్యాక స్క్రిప్ట్ లో మార్చారనే టాక్ వినిపించింది. అలాగే షూటింగ్ అనుకున్న ప్రకారం సాగలేదు. షెడ్యూల్స్ విషయంలో గజిబిజి నెలకొంది. దాంతో నటుల డేట్స్ ప్రాబ్లమ్ వచ్చింది.

ఏకంగా హీరోయిన్ పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దానికి అనేక కారణాలు వినిపించాయి. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది. మీనాక్షి చౌదరి కొత్తగా ప్రాజెక్ట్ లో వచ్చి చేరింది. ఒకరిద్దరు సాంకేతిక నిపుణులు కూడా మారారు. ఒక దశలో థమన్ ని పక్కన పెడుతున్నట్లు వార్తలు వచ్చాయి.

అనేక అవరోధాల మధ్య గుంటూరు కారం చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. కాగా అసలు ఈ కథ మహేష్ కోసం రాసింది కాదట. గతంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో ఒక మూవీ ప్రకటించారు. కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదు. ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ తో కమిట్ అయ్యాడు. దాంతో మహేష్ కి ఈ కథ వినిపించాడట త్రివిక్రమ్.

త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీ ఎన్టీఆర్ తో చేయాలని అనుకోగా… అది మహేష్ చేతికి వచ్చిందని టాలీవుడ్ టాక్. అసలు త్రివిక్రమ్… ఎన్టీఆర్, మహేష్ కాదు, పవన్ కళ్యాణ్ కోసం ఈ కథ రాశాడంటూ మరో వాదన తెరపైకి వస్తుంది. ఇది ఏమైనా ఏకంగా 13 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. గతంలో మహేష్ హీరోగా అతడు, ఖలేజా చిత్రాలను త్రివిక్రమ్ తెరకెక్కించారు.