Dhurandhar 2: ‘ తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పంతులు తగుతూ ముందుకు సాగుతుంది. పాన్ ఉండను షేక్ చేసే సినిమాలు చేసిన మన హీరోల హవా ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. ప్రస్తుతం ‘దురంధర్ 2’ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయలేకపోతున్నాయి. కారణమేంటి అంటే భారీ సినిమాలు పెద్ద హీరోలు నటించిన సినిమాలేవి ఈ మధ్యకాలంలో రాలేదు. ఇక మీదట నుంచి పెద్ద సినిమాల హవా మొదలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 30 వ తేదీన వస్తున్న పెద్ది సినిమాతో మన స్టార్ హీరోలు వల్ల జోరు చూపించడానికి రెడీ అవుతున్నారు. ఆ తర్వాత వస్తున్న ఫౌజీ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూడు సినిమాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి తెలుగు స్టార్ హీరోలు సైతం సిద్ధమవుతున్నారు. ‘దురంధర్ 2’ సినిమా తెలుగు సినిమాలను డామినేట్ చేస్తూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనవాళ్లు చేయబోతున్న సినిమాల విషయం మీదనే చాలా వరకు ఆసక్తి నెలకొంది.
Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?
ఇక ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంవత్సరానికి ఒక్క సినిమా అయిన చేస్తే ఇండస్ట్రీ మరింత బాగుపడుతుందని పలువురు సినిమా మేధావులు అభిప్రాయపడుతున్నారు. దురంధర్ 2 సినిమాకి చెక్ పెట్టాలంటే మన స్టార్ హీరోలు నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి.
లేకపోతే మాత్రం మరోసారి మన ఇండస్ట్రీ వెనుకబడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక 2027 వ సంవత్సరంలో రాజమౌళీ చేస్తున్న ‘వారణాసి’ సినిమా వస్తుంది. కాబట్టి ఆ సినిమా ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుంది. అప్పటివరకు మిగిలిన హీరోలందరు మన ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
వారణాసి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ షేక్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ ను సైతం మరోసారి దెబ్బ కొట్టే అవకాశం అయితే వస్తుంది. మరి వీటన్నింటిని తట్టుకోవాలంటే ముందు మన తెలుగు ఇండస్ట్రీ టాప్ లెవల్లో ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది…
