వాళ్లంతా తెలుగు సినీ పరిశ్రమలో మంచి స్నేహితులు.. ఒకరితో ఒకరు గొప్ప స్నేహంగా ఉంటారు. మొత్తం పదమూడు మంది స్నేహితులు.. వారిలో శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిశోర్ లాంటి లీడింగ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ‘చిత్రం’ శ్రీను, ‘సత్యం’ రాజేష్, తాగుబోతు రమేష్ లాంటి ఫేడ్ అవుట్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. ఇక ధన్ రాజ్, సప్తగిరి, సత్య, ప్రవీణ్, వేణు, నవీన్ నేని, నందు, రఘు లాంటి మీడియమ్ రేంజ్ ఆర్టిస్ట్ లు ఉన్నారు.
అయినా వీరంతా స్నేహంలో ఒకేలా ఉంటారు. ఒకరి మధ్య ఒకరికి మంచి స్నేహితులు. స్నేహానికి ఎంతో విలువ ఇచ్చే ఈ 13 మంది మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అయినా ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తారు. ఎవరైనా కష్టంలో ఉంటే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి తమ స్నేహబంధం గురించి కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్పుకొచ్చారు.
మా అందరికీ ‘ఫ్లయింగ్ కలర్స్’ అని ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. ఆర్టిస్టులుగా మేమంతా రంగుల ప్రపంచంలో ఉన్నాం అని మా గ్రూప్ కి ఆ పేరు పెట్టాం. మా గ్రూపులో ఉన్నవారందరం ఒకరికొకరం పరుగెత్తి పోటీపడతాం. అయినా మేము ప్రొఫెషనల్ లైఫ్ ని, ఫ్రెండ్షిప్ విషయంలో తీసుకురాం. అవకాశాల పరంగా ఎవరికి వారిమే అన్నట్లు ఉంటాం.
నిజానికి మేము ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో మాటా మాటా అనుకున్న సందర్భాలు ఉన్నా.. మళ్ళీ కలిసిపోతాం. అందరం కంట్రోల్ కాగలిగినవాళ్లమే. కాబట్టి, మా మధ్య పెద్దగా సమస్యలు కూడా రాలేదు. ఇక మాలో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే మేం అందరం కలిసి కోవిడ్ టైమ్లో కొందరికి హెల్ప్ కూడా చేశాము.