Photo Story: అబ్బాయి లాగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టగలరా..? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది!

సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేసే మీనాక్షి, ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫోటోలో ఆమె పక్కనే ఉన్న చిన్నారి ఆమెకు చెల్లెలు అవుతుంది.

Written By: Vicky, Updated On : September 21, 2024 5:33 pm

Photo Story(3)

Follow us on

Photo Story: ఈ ఫోటో లో తెల్ల చొక్కా వేసుకున్నది బుడ్డోడు అని మీరు అనుకుంటున్నారు కదా?, అలా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. ఆ ఫొటోలో ఉన్నది బుడ్డోడు కాదు, బుడ్డది. ఈ బుడ్డది ఇప్పుడు పెరిగి పెద్దయ్యాక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఈమె లేని సౌత్ సినిమా లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదేమో, ఆ రేంజ్ లో ఎదిగిపోయింది. మీడియం రేంజ్ హీరోలకు ఈమెనే కావాలి, స్టార్ హీరోలకు ఈమెనే కావాలి, చేసింది తక్కువ సినిమాలే అయినా, సౌత్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది ఈ బ్యూటీ. కేవలం తెలుగు, తమిళం మాత్రమే కాకుండా ఈమధ్య ఈమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయట. ఇలా చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?, ఆమె మరెవరో కాదు..మీనాక్షి చౌదరి.

Photo Story(4)

సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేసే మీనాక్షి, ఈ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫోటోలో ఆమె పక్కనే ఉన్న చిన్నారి ఆమెకు చెల్లెలు అవుతుంది. ఇది ఇలా ఉండగా మీనాక్షి చౌదరి 2019 వ సంవత్సరం లో ‘అప్ స్టార్ట్స్’ అనే బాలీవుడ్ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత యంగ్ హీరో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా ఈమెకు అవకాశాలు బాగా వచ్చాయి. తెలుగు లో ఈమె రెండవ సినిమా ‘ఖిలాడీ’. రవితేజ హీరో గా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ మీనాక్షి నటనకు, అందానికి మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘హిట్ : ది సెకండ్ కేస్’ అనే చిత్రం లో నటించగా ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’, తమిళ హీరో విజయ్ తో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘గుంటూరు కారం’ ఫ్లాప్ అవ్వగా, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. వీటి తర్వాత ఆమె చిరంజీవి తో ‘విశ్వంభర’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్(రెండవ హీరోయిన్), విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’, వరుణ్ తేజ్ ‘మట్కా’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. వీటిలో కనీసం రెండు సినిమాలు హిట్టైన మీనాక్షి కెరీర్ మారిపోయినట్టే అనుకోవచ్చు.