Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: 8వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 6 మంది కంటెస్టెంట్స్...

Bigg Boss Telugu 8: 8వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 6 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..పృథ్వీ కోసం ప్రేరణని నామినేట్ చేసిన విష్ణుప్రియ!

Bigg Boss Telugu 8: నిన్నగాక మొన్ననే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 50 రోజుల్లో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనికా, కిరాక్ సీత, మణికంఠ ఎలిమినేట్ అయ్యారు. అంటే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన 14 మందిలో 8 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలింది కేవలం ఆరు మంది మాత్రమే. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ వైల్డ్ కార్డు ద్వారా వచ్చినవారే. ఈ వారం కూడా పాత కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారా?, లేకపోతే వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదంతా పక్కన పెడితే, ఎప్పటి లాగానే నిన్న మధ్యాహ్నం నుండి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ ఎపిసోడ్ ని ఈరోజు రాత్రి టెలికాస్ట్ చేస్తారు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళే అని తెలుస్తుంది.

నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణు ప్రియ, మెహబూబ్ , నయనీ పావని మరియు హరితేజ నామినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. అయితే మెగా చీఫ్ అయిన కారణంగా గౌతమ్ కి బిగ్ బాస్ ఒకరిని నామినేషన్ నుండి తప్పించే పవర్ ఇస్తాడు. గౌతమ్ ఆ పవర్ ని ఉపయోగించి హరితేజ ని నామినేషన్స్ నుండి సేవ్ చేస్తాడు. కానీ అలా సేవ్ చేసినందుకు బిగ్ బాస్ ప్రైజ్ మనీ నుండి లక్ష రూపాయిలను కట్ చేస్తాడు. అలా ఎందుకు చేసాడు అనేది నేటి ఎపిసోడ్ ని చూస్తే తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ నామినేషన్స్ ఎపిసోడ్ లో ప్రేరణ, విష్ణుప్రియ మధ్య పెద్ద గొడవ జరిగిందని తెలుస్తుంది. నిన్న ఎపిసోడ్ చివర్లో టీవీ లో టెలికాస్ట్ చేసిన ప్రోమోలోనే ఈ విషయం అందరికీ తెలిసింది.

ఆహారం విషయం లో విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసినట్టు చూపించారు. కానీ ఆమె ఆ వంకతో పృథ్వీ కోసం నామినేట్ చేసిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పృథ్వీ, ప్రేరణ కి ఈమధ్య అసలు పడడం లేదు, ఇది విష్ణుప్రియ కి నచ్చలేదు. అలాగే పృథ్వీ ప్రేరణ,రోహిణి ని నామినేట్ చేస్తాడు. ఈ నామినేషన్ కూడా హౌస్ లో చాలా ఫైర్ మీద జరిగినట్టు సమాచారం. అలాగే అవినాష్ పృథ్వీ ని నామినేట్ చేస్తాడు. మళ్ళీ వీళ్లిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తుంది. అలా ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం పెద్ద హీట్ వాతావరణం లో జరిగినట్టు తెలుస్తుంది. అయితే నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మెహబూబ్, నయనీ పావని డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంది, వీరిలో నయనీ పావని ఎలిమినేట్ అవ్వొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version