Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి చీఫ్ ఒక్కరేనా..? హౌస్ మేట్స్ కోసం స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన బిగ్ బాస్!

గడిచిన మూడు వారాలు చీఫ్స్ కి సంబంధించిన క్లాన్ సభ్యుల మధ్య టాస్కులు ఉండేవి. మరి ఈ వారం ఎలా చేస్తారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ నిఖిల్ ప్రస్తుతానికి చీఫ్. మరి ఈ వారం టాస్కులు ఏ పద్దతి లో నిర్వహిస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అయితే ఈ వారం చీఫ్ అయ్యేందుకు హౌస్ మేట్స్ అందరూ నిఖిల్ తో పోటీ పడే అవకాశం ఉంది.

Written By: Vicky, Updated On : September 23, 2024 4:50 pm

Bigg Boss Telugu 8(37)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్స్ కి బదులుగా ప్రవేశపెట్టిన చీఫ్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. మొదటి వారం నిఖిల్, యష్మీ,నైనిక చీఫ్స్ గా కొనసాగారు. వీరిలో యష్మీ, నైనిక హౌస్ సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల నాగార్జున వాళ్ళిద్దరిని చీఫ్స్ పదవుల నుండి తప్పించి కేవలం నిఖిల్ ని మాత్రమే కొనసాగిస్తారు. ఆ తర్వాత అభయ్ ని కంటెస్టెంట్స్ అందరూ మరో చీఫ్ గా ఎంచుకుంటారు. మొదటి వారం ముగ్గురు చీఫ్స్ ఉండగా, రెండవ వారం కేవలం ఇద్దరు చీఫ్స్ మాత్రమే కొనసాగారు. ఇక మూడవ వారం కేవలం నిఖిల్ ఒక్కడే చీఫ్ గా కొనసాగే అవకాశం ఉంది. రెండవ చీఫ్ కూడా ఈ వారం ఉండే పని అయితే నిన్నటి ఎపిసోడ్ లోనే నాగార్జున ఎవరినో ఒకరిని చీఫ్ గా ప్రకటించేవాడు. కానీ అది జరగలేదు.

మరి గడిచిన మూడు వారాలు చీఫ్స్ కి సంబంధించిన క్లాన్ సభ్యుల మధ్య టాస్కులు ఉండేవి. మరి ఈ వారం ఎలా చేస్తారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ నిఖిల్ ప్రస్తుతానికి చీఫ్. మరి ఈ వారం టాస్కులు ఏ పద్దతి లో నిర్వహిస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. అయితే ఈ వారం చీఫ్ అయ్యేందుకు హౌస్ మేట్స్ అందరూ నిఖిల్ తో పోటీ పడే అవకాశం ఉంది. ఆయనని టాస్కులలో ఎవరైతే ఓడిస్తారో వాళ్ళు చీఫ్ గా నిలవచ్చు. అలా కాకుండా నిఖిల్ తో ప్రత్యేకంగా వీళ్ళందరూ చీఫ్స్ అయ్యేందుకు కూడా బిగ్ బాస్ టాస్కులు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా ఈ వారం బిగ్ బాస్ హౌస్ మొత్తం కంటెస్టెంట్స్ కి, చూసే ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా ఉండబోతుంది. 14 మంది ఇంటి సభ్యులతో మొదలైన ఈ సీజన్ ఇప్పుడు 11 మందికి చేయుకుంది. మరో రెండు వారాల్లో 9 కి చేరుకుంటుంది. అక్టోబర్ 4 కి 8 సభ్యులున్న ఇల్లు లాగా మారబోతుంది. అయితే అక్టోబర్ 4 వ తేదీన వైల్డ్ కార్డు ద్వారా ఆరు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారట.

అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ సంఖ్య 14 కి చేరుకుంటుంది. ఇలా రాబోయే రోజులు ఎంతో ఆసక్తికరంగా ఉండబోతుంది ఈ సీజన్. అయితే వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న 6 మంది కంటెస్టెంట్స్ లో ముగ్గురు పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఉండబోతున్నారట. అవినాష్, హరి తేజ, నయని పావని ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టబోతున్నారు. అలాగే రీతూ చౌదరీ, జ్యోతి రాయ్ మరియు అంజలి పవన్ కొత్త కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.