Bigg Boss Telugu 8: కొత్త ‘మెగా చీఫ్’ గా గౌతమ్ కృష్ణ..’గేమ్ చేంజర్’ గా నిల్చిన టేస్టీ తేజా..అసూయతో రగిలిపోయిన నిఖిల్, నబీల్!

రాయల్ క్లాన్ సభ్యులు చర్చించుకొని ఓజీ క్లాన్ లో బలమైన కంటెస్టెంట్స్ గా నిల్చిన నిఖిల్, నబీల్ ని తొలగిస్తారు. అలా మెగా చీఫ్ పోటీ నుండి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పిలవబడే నిఖిల్, పృథ్వీ, నబీల్ తప్పుకోగా, మొగిలిన 12 మంది కంటెస్టెంట్స్ మెగా చీఫ్ పోటీలకు తలపడుతారు.

Written By: Vicky, Updated On : October 18, 2024 8:32 am

Bigg Boss Telugu 8(129)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు చాలా హీట్ వాతావరణం లో కొనసాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంత ఫిజికల్ అవుతున్న ఈ గేమ్ లో గెలిచి మెగా చీఫ్ అయ్యేవాళ్ళు తోపు కంటెస్టెంట్స్ క్యాటగిరిలో పెట్టేయొచ్చు అని అందరికి అనిపించింది. నిన్న నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన పెనుగులాట ని చూసి తోటి హౌస్ మేట్స్ మొత్తం షాక్ కి గురి అయ్యారు. ఇంత కసిగా ఆడుతున్నారేంటి అని చూసే ఆడియన్స్ కి కూడా అనిపించింది. గౌతమ్, నిఖిల్ తో పాటు ‘డ్రామాకంఠ’ కి తప్ప, మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ దెబ్బలు బాగా తగిలాయి. యష్మీ, ప్రేరణ, విష్ణు ప్రియ కూడా ప్రాణం పెట్టి ఆడేసారు. అయితే ఈరోజు ఎపిసోడ్ లో పిల్లో టాస్క్ జరగబోతుంది అనే విషయం నిన్నటి ఎపిసోడ్ చివర్లో ప్రసారం చేసిన ప్రోమో లో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది.

ఈ టాస్క్ లో టేస్టీ తేజా తన క్లాన్ ని ఒంటి చేతితో గెలిపించాడు అనే చెప్పాలి. టాస్క్ ఏమిటంటే LED స్క్రీన్ లో బిగ్ బాస్ కొన్ని గుర్తులను చూపిస్తాడు. ఆ గుర్తులు బయట గార్డెన్ ప్రాంతం లో ఏర్పాటు చేసిన పిల్లోల మీద ఉంటాయి. హౌస్ మేట్స్ ఆ గుర్తులను గుర్తు పెట్టుకొని , ఆ గుర్తులు ఉన్నటువంటి పిల్లోని వెతికి పట్టుకొని, పరిగెత్తుకుంటూ ఒక ఖాళీ బ్లాక్ లో వెయ్యాలి. బజర్ మోగే వరకు ఈ టాస్క్ జరుగుతుంది. మొత్తం పది రౌండ్లు జరగగా, రాయల్ క్లాన్ సభ్యులు 5 పాయింట్స్ గెలవగా, ఓజీ క్లాన్ సభ్యులు నాలుగు పాయింట్స్ గెలుస్తారు. ముఖ్యంగా టేస్టీ తేజ ఈ టాస్క్ లో గేమ్ చేంజర్ గా నిలిచి మూడు పాయింట్స్ ని తన టీం కోసం సంపాదిస్తాడు. అలా ఈ టాస్క్ లో రాయల్ క్లాన్ గెలవడంతో బిగ్ బాస్, ఓజీ క్లాన్ నుండి ఇద్దరినీ తీసివేసే పవర్ ని రాయల్ క్లాన్ కి ఇస్తారు.

రాయల్ క్లాన్ సభ్యులు చర్చించుకొని ఓజీ క్లాన్ లో బలమైన కంటెస్టెంట్స్ గా నిల్చిన నిఖిల్, నబీల్ ని తొలగిస్తారు. అలా మెగా చీఫ్ పోటీ నుండి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పిలవబడే నిఖిల్, పృథ్వీ, నబీల్ తప్పుకోగా, మొగిలిన 12 మంది కంటెస్టెంట్స్ మెగా చీఫ్ పోటీలకు తలపడుతారు. వీళ్లందరినీ ఓడించి గౌతమ్ కృష్ణ హౌస్ కి కొత్త మెగా చీఫ్ గా ఎంపిక అవుతాడు. 12 మందిని పోటీలో ఓడించి గౌతమ్ గెలవడం అనేది చిన్న విషయం కాదు. ఈ దెబ్బతో అతని ఓటింగ్ గ్రాఫ్ నిఖిల్, నబీల్ తో సమానంగా మారిపోయింది. గౌతమ్ కృష్ణ కొత్త చీఫ్ అవ్వడంతో నిఖిల్, నబీల్ ముఖాలు మాడిపోయాయి. గౌతమ్ వీళ్లిద్దరికీ మొదటి నుండి నచ్చడం లేదనే విషయం తెలిసిందే. చూడాలి మరి రాబోయే వారాల్లో ఈ ముగ్గురి మధ్య ఏ స్థాయి గొడవలు జరగబోతున్నాయి అనేది.