Bigg Boss OTT 2: బిగ్ బాస్ షో ఫేక్… హౌస్ లో మొబైల్ వాడుతూ అడ్డంగా బుక్ అయిన లేడీ కంటెస్టెంట్!

బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 నుండి ఓ ఫోటో బయటకు రాగా కంటెస్టెంట్ పూజా భట్ పక్కన మొబైల్ ఉంది. పూజా భట్, ఎల్విస్ యాదవ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు.

Written By: Shiva, Updated On : August 10, 2023 9:21 am

Bigg Boss OTT 2

Follow us on

Bigg Boss OTT 2: బిగ్ బాస్ షోపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన షో అయినప్పటికీ… ఎంత వరకు రియాలిటీ ఉందనే సందేహాలు కలిగిస్తుంది. నాలుగు గోడల మధ్య చూపించే కంటెంట్ నిజం కాదు. ఇది షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా చెప్పారు. అక్కడ జరిగేది వేరు ఎపిసోడ్స్ లో చూపించేది వేరు. ఎడిటింగ్ ద్వారా నిర్వాహకులు ఓ కంటెస్టెంట్ ని లేపగలరు. మరొక కంటెస్టెంట్ ని ఆడియన్స్ లో బ్యాడ్ చేయగలరు అనే వాదన ఉంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన సరయు తీవ్ర ఆరోపణలు చేసింది.

బిగ్ బాస్ షో అంతా ఫేక్. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కొందరు ఎదురు డబ్బులిచ్చి షోకి వెళతారు. వాళ్లకు హౌస్లో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అలా డబ్బులిచ్చి వెళ్లిన కంటెస్టెంట్స్ జోలికి వెళితే వాళ్ళను బయటకు పంపేస్తారని సరయు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళితే బయటకు వచ్చే వరకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు అంటారు. ఇది కూడా అబద్ధమే అని తాజా సంఘటనతో తేలింది.

బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 నుండి ఓ ఫోటో బయటకు రాగా కంటెస్టెంట్ పూజా భట్ పక్కన మొబైల్ ఉంది. పూజా భట్, ఎల్విస్ యాదవ్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పూజ పక్కన ఉన్న కుర్చీలో మొబైల్ ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. బిగ్ బాస్ షో అంతా ఫేక్. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటున్నారు. బిగ్ బాస్ హౌస్ నిబంధనలకు వ్యతిరేకంగా పూజా భట్ మొబైల్ ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు.

తాజా ఫోటో బిగ్ బాస్ షోపై మరిన్ని అనుమానాలు కలగజేసింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 జూన్ 17న మొదలైంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. జియో సినిమాలో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం అవుతుంది. చివరికి చేరిన ఈ సీజన్ ఫైనలిస్ట్స్ గా పూజా భట్, ఎల్విస్ యాదవ్, బేబిక, అభిషేక్, మనీషా ఉన్నారు. 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.