Bigg Boss 8 Telugu : ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ ‘గంగవ్వ’ కేసు లో ఊహించని ట్విస్ట్..భారీ జరిమానా విధించిన అధికారులు..ఎంతంటే!

గౌతమ్, విష్ణు ప్రియ వంటి వాళ్లపై ఇష్టమొచ్చినట్టు నోరు జారేస్తుంది. ఈమె బదులుగా వేరే యంగ్ కంటెస్టెంట్ ని తీసుకొచ్చి ఉండుంటే సీజన్ కి బాగా ప్లస్ అయ్యేది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : October 25, 2024 8:44 pm
Follow us on

Bigg Boss 8 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా, ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 8 లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా గంగవ్వ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సంగతి అందరికీ తెలిసిందే. టాస్కులు మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే పెద్దగా ఆడలేకపోతున్నప్పటికీ, ఎంటర్టైన్మెంట్ అందించే విషయంలో మాత్రం గంగవ్వ ఏమాత్రం తగ్గడం లేదు. హౌస్ కి ఒక పెద్ద దిక్కుగా ఆమె మారిపోయింది. ఇటీవలే ఆమె అర్థ రాత్రి దెయ్యం పట్టినట్టు నటించి హౌస్ మేట్స్ అందరినీ ఎంతలా భయపెట్టిందో మనమంతా చూసాము. ఇప్పటికీ ఇది ప్రాంక్ అనే విషయం హౌస్ మేట్స్ కి తెలియదు. అంతలా జీవించేసింది గంగవ్వ. అయితే ఈ ఎపిసోడ్ జరిగిన మరుసటి రోజు ఆమె పై కేసు నమోదు అయ్యిందని, పోలీసులు ఆమెని అరెస్ట్ చేయబోతున్నారని, అందువల్ల ఈ వారం ఆమె సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది.

అయితే దీనిపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. గంగవ్వ ని పోలీసులు అరెస్ట్ చేయడం లేదు. కేవలం ఆమెకి జరిమానా మాత్రమే విధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పట్లో గంగవ్వ యూట్యూబ్ లో పాపులర్ అయిన ‘మై విలేజ్’ షోలో రాజు అనే వ్యక్తితో కలిసి చిలక జోశ్యం చెప్పడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. పంజరం లో చిలుక ని బంధించడం అనేది హింస క్రింద వస్తుందని, చట్ట రీత్యా ఇది నేరమని, గంగవ్వ పై, మై విలేజ్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదు చేయడం తో అటవీ శాఖ గంగవ్వ పై పోలీస్ కేసు నమోదు చేసింది. కాగా, ఈ కేసు గురించి మై విలేజ్ షో బృందానికి చెందిన అనిల్ మాట్లాడుతూ ‘మాకు ఈ చట్టం గురించి తెలియదు. పొరపాటున జరిగిందని పోలీసులకు తెలియచేసాము. వాళ్ళు అర్థం చేసుకొని అరెస్ట్ వంటి చర్యలు చేయకుండా 25 వేల రూపాయిల జరిమానా విధించారు. మేము అది కట్టి కేసు అక్కడితో క్లోజ్ చెయ్యించాము’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో గంగవ్వ కి కాస్త రిలీఫ్ దొరికింది.

ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నప్పటికీ, కంటెస్టెంట్స్ పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అసలు ఈమెని హౌస్ లోకి ఎందుకు తీసుకొచ్చారు?, హౌస్ లో కుర్చీలు, సోఫాలు ఏమి పని చేస్తున్నాయో, గంగవ్వ కూడా అదే చేస్తుంది. దాని కోసం ఆమెని తీసుకొని రావడం ఎందుకు?, పైగా ఈమెకు వయస్సుకు తగ్గ బుద్ధి పెరగలేదు, నిన్న కూడా టేస్టీ తేజ ని చితకబాదింది, అలాగే గౌతమ్, విష్ణు ప్రియ వంటి వాళ్లపై ఇష్టమొచ్చినట్టు నోరు జారేస్తుంది. ఈమె బదులుగా వేరే యంగ్ కంటెస్టెంట్ ని తీసుకొచ్చి ఉండుంటే సీజన్ కి బాగా ప్లస్ అయ్యేది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.