Bigg Boss Telugu 8: ఆ ఇద్దరు సెన్సేషనల్ లేడీస్ కి నో ఛాన్స్… నిరాశలో ఫ్యాన్స్!

మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యింది. మొదటి నుండి ప్రచారం అవుతున్న ఇద్దరు సెన్సేషనల్ లేడీస్ కి అవకాశం దక్కలేదని తెలుస్తుంది. వారిద్దరికి ఆసక్తి ఉన్నా కూడా బిగ్ బాస్ మేకర్స్ హ్యాండ్ ఇచ్చారట..

Written By: S Reddy, Updated On : August 25, 2024 11:08 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షో. జనాల్లో ఈ షో పట్ల అత్యంత ఆసక్తి ఉంది. బిగ్ బాస్ లవర్స్ లేటెస్ట్ సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి సన్నాహాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నారు.

లేటెస్ట్ సీజన్ కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటుడు ఖయూమ్, తేజస్విని గౌడ, యాష్మి గౌడ, సౌమ్యరావు, అంజలి పవన్, బంచిక్ బబ్లు, అభిరామ్ వర్మ, సింగర్ సాకేత్, బెజవాడ బేబక్క ఉన్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్తగా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే మొదటి నుండి ప్రచారమైన ఇద్దరు సోషల్ మీడియా సెన్సేషన్స్ కి బిగ్ బాస్ తెలుగు 8లో ఛాన్స్ దక్కలేదని తెలుస్తుంది.

సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క బిగ్ బాస్ షోకి ఎంపికైందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. పల్లెటూరి అమ్మాయి అయిన బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పొటీ చేసి మరింత ఫేమ్ రాబట్టింది. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు బర్రెలక్క గురించి ప్రముఖంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో బర్రెలక్క సీజన్ 8లో కంటెస్ట్ చేస్తుంది అంటూ గట్టి ప్రచారం జరిగింది. ఆడియన్స్ కూడా ఆమె షోలో ఉంటుందని భావించారు.

అయితే తనకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదని బర్రెలక్క తెలియజేసింది. తన పేరు కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉందట. అయితే ఆమెకు ఫేమ్ తగ్గిపోయింది. ఎంపిక చేయడం అవసరమా? అని నిర్వాహకులు భావించారట. ఈ క్రమంలో బర్రెలక్క అసహనం వ్యక్తం చేసింది. ఫేమ్ ఎవరికీ శాశ్వతం కాదు. నన్ను బిగ్ బాస్ షోకి తీసుకున్నా, తీసుకోకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు. నా ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నానని… బర్రెలక్క స్పష్టం చేసింది.

అలాగే మిర్యాలగూడలో 2018లో జరిగిన పరువు హత్య బాధితురాలు అమృత ప్రణయ్ సీజన్ 8లో కంటెస్ట్ చేస్తుందంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై అమృత స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తనను ఎవరూ సంప్రదించలేదు. ఎలాంటి ఫోన్ రాలేదు. నేను బిగ్ బాస్ 8కి వెళుతున్నానన్న వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చింది. బర్రెలక్క, అమృత బిగ్ బాస్ హౌస్ వేదికగా సంచలనాలు చేస్తారని ఫ్యాన్స్ భావించారు. వారు పాల్గొనడం లేదని తెలిసి నిరాశ చెందుతున్నారు…