Bandla Ganesh- Diwali: బండ్ల గణేష్ చర్యలు ఊహాతీతం. ఆయన మాటలు, సోషల్ మీడియా ట్వీట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే చర్చకు తెర లేపుతాయి. తాజాగా దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. బండ్ల గణేష్ భారీ మొత్తంలో బాణాసంచా సామాగ్రి కొన్నారు. తాను కొన్న దీపావళి టపాసులను ఇంటి ముందు పేర్చి కుటుంబ సభ్యులతో పాటు ఫోటో దిగారు. సదరు ఫోటో ట్వీట్ చేసిన బండ్ల గణేష్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద మొత్తంలో ఉన్న బాణాసంచా చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఇన్ని టపాసులు మీ కుటుంబం కోసమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బండ్ల గణేష్ కొన్న ఆ టపాసుల విలువ కూడా బయటకు వచ్చింది. దాదాపు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టిన దీపావళి బాణాసంచా బండ్ల గణేష్ కొనుగోలు చేశాడట. కాగా ఆయనకొనుగోలుచేసిన ఈ పటాసులు మొత్తం తమ కుటుంబం కోసం కాదట. వాటిలో కొన్ని సన్నిహితులకు, చుట్టుపక్కల జనాలకు పంచుతారని సమాచారం. ప్రతి ఏడాది బండ్ల గణేష్ ఇలానే భారీగా బాణా సంచా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ గా మారింది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు. పవన్ డై హార్డ్ ఫ్యాన్ అయిన బండ్ల గణేష్ ని ఆయన అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ సోషల్ మీడియా పోస్ట్స్ కి పవన్ ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతారు. బండ్ల గణేష్ ప్రతి పోస్ట్ పై తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. దీపావళి వేడుకలు కోసం భారీగా బాణా సంచా కొనుగోలు చేసిన బండ్లను నువ్వు తోపు అంటూ కొనియాడుతున్నారు.

మరోవైపు బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ తో ఒక మూవీ చేయాలని వారు భావిస్తున్నారు. గతంలో బండ్ల గణేష్ నిర్మాతగా తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు తెరకెక్కాయి. తీన్ మార్ నిరాశపరిచినా గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. పవన్ కెరీర్ లో గబ్బర్ సింగ్ అతిపెద్ద హిట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తానని బండ్ల గణేష్ అంటున్నారు. తమ కాంబినేషన్ లో వచ్చే మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు చేస్తాము అంటున్నారు.