బాలయ్య వర్సెస్ మెగాస్టార్.. ఫ్యాన్స్ లొల్లి షూరు..!

నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ లొల్లి మళ్లీ షూరు అయింది. నటసింహ బాలకృష్ణ తాను నటించి దర్శకత్వం చేసిన ‘నర్తనశాల’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం చిరంజీవి గతంలో నటించి ఆగిపోయిన సినిమాలను ఇప్పుడు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: ఆర్ఆర్ఆర్ టీజర్ టాక్: నా తమ్ముడు.. గోండు బెబ్బులి ‘కొమురం భీం’ బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ […]

Written By: NARESH, Updated On : October 22, 2020 1:04 pm
Follow us on

నందమూరి వర్సెస్ మెగా ఫ్యాన్స్ లొల్లి మళ్లీ షూరు అయింది. నటసింహ బాలకృష్ణ తాను నటించి దర్శకత్వం చేసిన ‘నర్తనశాల’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం చిరంజీవి గతంలో నటించి ఆగిపోయిన సినిమాలను ఇప్పుడు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ టీజర్ టాక్: నా తమ్ముడు.. గోండు బెబ్బులి ‘కొమురం భీం’

బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ లాగే పలు పౌరణిక సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తూనే పలు సినిమాలకు స్వీయదర్శకత్వం చేశాడు. ఆయన బాటలోనే బాలకృష్ణ కూడా నడుస్తున్నాడు. ఈక్రమంలోనే నర్తనశాల మూవీని బాలకృష్ణ నటిస్తూ తెరకెక్కించాడు.

‘నర్తనశాల’లో బాలకృష్ణ అర్జునుడిగా నటిస్తుండగా ద్రౌపదిగా సౌందర్య.. భీముడిగా శ్రీహరి నటించారు. అయితే అనివార్య కారణాలతో ఈ చిత్రం ఆగిపోయింది. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్లలో విడుదల చేయనున్నట్లు బాలకృష్ణ తెలిపారు. 17నిమిషాల నిడివితో ‘నర్తనశాల’ను అభిమానుల ముందుకు రానుంది. దీని ద్వారా వసూలైన డబ్బులను సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు బాలయ్య తెలిపాడు.

బాలయ్య సినిమాలాగే చిరంజీవి గతంలో నటించిన పలు సినిమాలు మధ్యలో నిలిచిపోయాయి. వాటిలో ఒకటి ‘అబు: బాగ్దాద్‍ గజదొంగ’. అప్పట్లో ఈ మూవీని భారీ బడ్జెట్లో తెరకెక్కించారు. ఈ మూవీకి అనుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ పెరిగిపోవడం.. ముస్లిమ్‍ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ మూవీని మధ్యలోనే నిలిపివేశారు.

Also Read: బిగ్ బాస్ ట్రెండ్స్ చూస్తుంటే ఈసారి అతడే విన్నర్?

ఇటీవల ఆగిపోయిన సినిమాలను సైతం కొంత కలరింగ్ ఇచ్చి దర్శక, నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రావడం లేదు. దీంతో పలువురు హీరోలు ఆగిపోయిన సినిమాలను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే చిరంజీవి గతంలో నటించి ఆగిపోయిన ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ సినిమా ఫుటేజ్ ను విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

బాలయ్య ‘నర్తనశాల’ పుణ్యమా అని మెగాస్టార్ పాత సినిమా మళ్లీ తెరపైకి వచ్చింది. మెగాస్టార్ ‘ఆచార్య’ మూవీ ఇప్పట్లో వచ్చేలా కన్పించడం లేదు. దీంతో ‘అబు: బాగ్దాద్ గజదొంగ’లోనైనా తమ హీరోను మరోసారి చూసుకోవచ్చని మెగా ప్యాన్స్ ముచ్చట పడుతున్నారు. అయితే వీరి ఆశ నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సిందే..!