బీహార్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఊహించని హామి ఇచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నారని, వ్యాక్సిన్ వచ్చాక రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ఆ పార్టీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల మెనిఫెస్టోను ఆమె విడుద చేశారు. అలాగే రాష్ట్రంలో 19 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు కొత్తగా 3 లక్షల మంది టీచర్లను నియమిస్తామని ఆమె పేర్కొన్నారు. బీజేపీ హయాంలో బీహార్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు.