Balakrishna And Gopichand Malineni: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు సైతం తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక బాలయ్య బాబు సైతం తన తదుపరి సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సన్నీ డియోల్ ను హీరోగా పెట్టి ‘జాట్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాకి అక్కడ మంచి రెస్పాన్స్ రావడంతో అతనికి బాలీవుడ్ లో కూడా చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. దాంతో ఇప్పుడు బాలయ్య బాబుతో చేస్తున్న సినిమాని లాన్ ఇండియా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో గోపీచంద్ మలినేని ఉన్నారట.
ప్రస్తుతం ఆయన ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నాడట. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. ఇంతకుముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో చేయనటువంటి ఒక డిఫరెంట్ క్లైమాక్స్ ఈ మూవీలో ఉండబోతుందట. ఇంతకీ ఏం ప్లాన్ చేశారనే విషయాన్ని క్లారిటిగా చెప్పడం లేదు.
కానీ క్లైమాక్స్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలుస్తుందని చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలతో వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని అతని అభిమానులైతే కోరుకుంటున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది… మొత్తానికైతే తెలుగులో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన బాలయ్య బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
