Aswani Dutt : ఉత్తమ గుండా ఉత్తమ రౌడీ… ఏపీ ప్రభుత్వం మీద అశ్వినీదత్ సీరియస్ కామెంట్స్!

అశ్వినీదత్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుతం వేరే సీజన్ నడుస్తుంది. ఇప్పుడంతా ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తారు

Written By: NARESH, Updated On : May 1, 2023 3:30 pm

Ashwinidatt

Follow us on

Aswani Dutt : నిర్మాత అశ్వినీ దత్ వైసీపీ ప్రభుత్వం మీద మరోసారి తన అసహనం బయటపెట్టారు. ఏపీలో ప్రస్తుతం రౌడీ పాలన నడుస్తుందని పరోక్షంగా సెటైర్స్ వేశారు. విషయంలోకి వెళితే… సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ‘మోసగాళ్లకు మోసగాడు’ మైలురాయిగా నిలిచిపోయింది. అప్పట్లో ఇది ట్రెండ్ సెట్టర్. భారతీయ సినిమా చరిత్రలో మొదటి కౌబాయ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ మూవీ విడుదలై యాభై ఏళ్ళు దాటిపోతుంది. మే 31న కృష్ణ జయంతి. ఈ సందర్భంగా మోసగాళ్లను మోసగాడు రీరిలీజ్ చేయాలని నిర్మాత ఆదిశేషగిరి రావు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అశ్వినీదత్, తమ్మారెడ్డి భరద్వాజ, బి గోపాల్ హాజరయ్యారు. ఓ విలేకరి రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డ్స్ ఇవ్వడం ఆపేశాయి. దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా… అశ్వినీదత్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రస్తుతం వేరే సీజన్ నడుస్తుంది. ఇప్పుడంతా ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తారు. రెండు మూడేళ్ళలో మరలా నంది అవార్డులు ఇచ్చే సీజన్ వస్తుంది, అన్నారు.

వైసీపీ గవర్నమెంట్ లో రౌడీ పాలన నడుస్తుంది. వాళ్లు సినిమా అవార్డ్స్ ఇవ్వడం వంటి మంచి పనులు చేయరు. ఈసారి ప్రభుత్వం మారుతుంది. అప్పుడు నంది అవార్డ్స్ ఇస్తారు.. అని ఎద్దేవా చేశారు. చెప్పాలంటే ఆయన టీడీపీకి మద్దతుగా మాట్లాడారు. అశ్వినీదత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ డై హార్డ్ ఫ్యాన్. సందర్భం రావడంతో ఆయన వైసీపీకి చురకలు అంటించారు. అందులోనూ వైసీపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య అనేక విబేధాలు నెలకొన్నాయి. టికెట్స్ ధరల విషయంలో పెద్ద రాద్ధాంతం జరిగింది.

ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన పోసాని కృష్ణమురళి ఇటీవల నంది అవార్డ్స్ ని ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవి ఒక కులం కోసం ఏర్పాటు చేసుకున్న అవార్డ్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక అశ్వినీదత్ తాజా కామెంట్స్ పై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ప్రస్తుతం అశ్వినీ దత్ ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే తెరకెక్కిస్తున్నారు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు.