Anchor Ravi : కొత్త ఇల్లు కట్టుకుంటున్న యాంకర్ రవి.. వైరల్ వీడియో

మొత్తానికైతే ఇప్పుడున్న ఇల్లు కాకుండా రవి ఇంకో ఇల్లు కట్టుకోవడం అనేది బుల్లితెర ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

Written By: NARESH, Updated On : January 14, 2024 7:00 pm
Follow us on

Anchor Ravi : ఒక షో ని జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే దానికి యాంకర్ అనేవాళ్ళు చాలా ముఖ్యం వాళ్ళు ఎంత బాగా యాంకరింగ్ చేస్తే ఆ షో గానీ లేదా ఈవెంట్ గానీ అంత బాగా సక్సెస్ అవుతుంది. ఇక బుల్లితెర మీద యాంకర్ అంటే మనందరికీ గుర్తొచ్చే ఒకేక పేరు సుమ… ఈమె చాలా సంవత్సరాల పాటు తనకు పోటీ లేకుండా తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తు వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే అనసూయ, రష్మి లాంటి కొంతమంది యాంకర్స్ ఆమెకి పోటీ ఇవ్వడానికి వచ్చినప్పటికీ సుమ యాంకరింగ్ ముందు వాళ్ళు నిలబడలేక పోయారు.ఇక ఇప్పటికీ తనే నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది.

ఇక ఇదిలా ఉంటే మేల్ యాంకర్స్ లో ప్రదీప్, రవి ఇద్దరు కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ముఖ్యంగా రవి అయితే ఈటీవీ ప్లస్ లో వచ్చిన పటాస్ షో తో చాలా పాపులారిటీని సంపాదించుకున్నాడు. నిజానికి ఈ షో ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన వాళ్లలో రవి మొదటి స్థానంలో ఉంటాడు.తన మాటలు తన చేష్టల ద్వారా ఆయన సంపాదించుకున్న క్రేజ్ ను చూసి ఆయనకి ఇంకా చాలా షోస్ చేసే అవకాశాలు కూడా వచ్చాయి.

అలాగే చాలా ఈవెంట్లకి కూడా రవి యాంకరింగ్ చేశాడు. ఇక ఇప్పుడు కొంతవరకు ఆయన క్రేజ్ తగ్గినప్పటికీ అడపాదప యాంకరింగ్ తో నెట్టుకు వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు తను ఒక కొత్త ఇల్లు కట్టుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి కన్ స్ట్రక్షన్ లో ఉన్న తన ఇంటి దగ్గర తన ఫ్యామిలీ తో కలిసి ఫొటోస్ దిగి వాటిని ఇన్స్టాలో అప్లోడ్ చేశాడు. ఇక ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఇది చూసిన ప్రేక్షకులు రవి కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు అంటూ పలు రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆ ఫొటోస్ కి కొంతమంది విచిత్రమైన కామెంట్లను కూడా యాడ్ చేస్తున్నారు.

అవి ఏంటి అంటే యాంకరింగ్ చేసి రవి డబ్బులు బాగా సంపాదించాడు అందుకే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం రవికి యాంకర్ గా కెరియర్ ముగిసిపోయింది. అందుకే ఇక ఇల్లు కట్టుకొని దాంట్లో సెటిల్ అవ్వలని చూస్తున్నాడు అంటూ మొత్తానికైతే ఇప్పుడున్న ఇల్లు కాకుండా రవి ఇంకో ఇల్లు కట్టుకోవడం అనేది బుల్లితెర ఆడియన్స్ లో హాట్ టాపిక్ గా మారింది.