Anasuya Bharadwaj : అనసూయ అరాచకం.. చీరకట్టి ఆ పార్టీలు చూపిస్తూ మతిపోగొట్టే ఫొటోలు వైరల్

జబర్దస్త్ వేదికగా సంచలనాలు చేసిన అనసూయ... కేవలం వెండితెరకు పరిమితం అయ్యారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఆమె తెగేసి చెప్పారు.

Written By: NARESH, Updated On : September 25, 2023 6:54 pm
Follow us on

Anasuya Bharadwaj : అనసూయ టైం నడుస్తుంది. ఆమె వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది అనసూయ రంగమార్తాండ, విమానం చిత్రాల్లో నటించారు. రెండు చిత్రాల్లో కథలో ప్రాధాన్యత ఉన్న రోల్స్ దక్కాయి. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ మూవీలో గడసరి కోడలు పాత్ర చేసింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ తో సాగుతుంది. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇక విమానం చిత్రంలో వేశ్యగా నటించి షాక్ ఇచ్చింది. ఇలాంటి బోల్డ్ రోల్స్ చేయడానికి చాలా మంది ముందుకు రారు.

అనసూయ సవాళ్లకు ఎదురెళ్ళే టైప్ అందుకే, భయపడకుండా చేసింది. వెయ్యి రూపాయలిస్తే ఎవడైనా ఓకే అంటూ బోల్డ్ డైలాగ్స్ చెప్పడం విశేషం. రంగమార్తాండ, విమానం కమర్షియల్ గా ఆడకున్నా అనసూయకు మంచి పేరు తెచ్చాయి. అనసూయ కీలక రోల్ చేసిన మరో చిత్రం విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన పెదకాపు 1 సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ మూవీలో విలేజ్ విమెన్ గా ఆమె కనిపించనున్నారు.

నూతన హీరో విరాట్ కర్ణ నటించాడు. విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. పెదకాపు 1 ట్రైలర్ ఆకట్టుకున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటుంది అనసూయ. తాజాగా పెదకాపు ప్రమోషనల్ ఈవెంట్ కి నల్ల చీర కట్టుకొని వచ్చింది. డిజైనర్ శారీలో అనసూయ అందాలు అదరహో అనాలి. అందరి దృష్టి ఆమె పైనే పడింది.

అలాగే అనసూయ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ 2024 ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రంలో దాక్షాయణిగా నెగిటివ్ రోల్ చేస్తుంది. కాగా అనసూయ బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యారు. ఫ్యాన్స్ ఆమెను బాగా మిస్ అవుతున్నారు. జబర్దస్త్ వేదికగా సంచలనాలు చేసిన అనసూయ… కేవలం వెండితెరకు పరిమితం అయ్యారు. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఆమె తెగేసి చెప్పారు.