
కరోనా లాక్ డౌన్ వల్ల చిత్ర పరిశ్రమ అస్తవ్యస్తంగా తయారైంది. తారల కాల్ షీట్స్ దగ్గర నుంచి షూటింగ్ షెడ్యూల్స్ దాకా అన్నీ గందరగోళం లో పడ్డాయి. ఇంకా చెప్పాలంటే సినీ రంగం దిక్కు తోచని స్థితిలో ఉంది. అలాగే అవుట్ డోర్ షూటింగ్ సగం ,సగం అయిన వారి పరిస్థితి మరీ దారుణం గా ఉంది షూటింగ్ సగంలో ఆగిపోయిన సినిమాలకు తారల డేట్స్ వేస్ట్ అవ్వడం వలన రెడ్డొచ్చి మొదలెట్టినట్టు అయ్యింది. హైదరాబాద్ దాటి బయట షూటింగ్ చేయాల్సిన సినిమాలకు ఇపుడు చెప్పనలవి కానీ కస్టాలు వచ్చాయి. కథ తో ముడి పడి ఉన్న అవుట్ డోర్ లొకేషన్ లలో ఇపుడు షూటింగ్ చేయలేని గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.ఆ క్రమంలో పలు సినిమాలు కధలో మార్పులు చేసుకోవడం తో పాటు ,బాలన్స్ ఉన్న అవుట్ డోర్ వర్క్ ని ఇక్కడే హైదరాబాద్ లో సెట్స్ వేసి ఫినిష్ చేయాలని నిశ్చయించు కొన్నాయి .
నాగశౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందే ఒక చిత్రానికి ఇండియా లో సగం , అమెరికాలో సగం షూటింగ్ జరపాల్సి ఉండగా, ఇపుడు అమెరికా షెడ్యూలు క్యాన్సల్ చేసుకొని కథను మార్చి హైదరాబాద్ లోనే షూటింగ్ చేయబోతున్నారు. అలాగే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా రూపొందే ఫైటర్ సినిమా కూడా ఇపుడు హైదరాబాద్ కి షిఫ్ట్ కాబోతుంది. ముంబై లోని ధారావి ప్రాంతంలో కొంతవరకు షూటింగ్ చేసిన ` ఫైటర్ ` సినిమాని ఇపుడు మారిన పరిస్థితుల వల్ల హైదరాబాద్ లోనే ధారావి సెట్స్ వేసి పూర్తి చేయబోతున్నారు అదే క్రమంలో ఇంకా షూటింగ్ మొదలుకాని పవన్ కళ్యాణ్ , క్రిష్ కాంబో చిత్రం కూడా జార్జియా లో షూటింగ్ చేద్దాం అనుకోని ఇపుడు హైదరాబాద్ లోనే చేయబోతున్నారు .
ఆ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకొంది. కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. లాక్ డౌన్ ముగియగానే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తి చేయబోతున్నారు. ఇంకా ఎన్ని సినిమాలు తమ షూటింగ్ షెడ్యూల్స్ మార్చుకొని హైదరాబాద్ లో ఫినిష్ చేస్తోరో .తొందర్లోనే తెలుస్తుంది .