Homeఎంటర్టైన్మెంట్ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి సీక్వెల్

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి సీక్వెల్


2019 జూన్ 21 న విడుదలైన ” ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” .చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రం లో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టికి ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. విభిన్న కథ , కధనం తో రూపొందిన ఈ చిన్న చిత్రం ప్రేక్షకులకి బాగా నచ్చింది. కేవలం 1 కోటి 50 లక్షలు బడ్జట్ తో తయారైన ఈ చిత్రం 17 కోట్ల 50 లక్షలు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది . కాగా ఇపుడా చిత్రానికి సీక్వెల్ రాబోతుంది.

తాజా గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ ” ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” కి సీక్వెల్ రాబోతుందని ధ్రువీకరించాడు . ఇక ఆ సినిమా తరవాత మరో తెలుగు సినిమాలో కనపడక పోవడానికి కారణం చెబుతూ . కథలు నచ్చకపోవడమే ఇలా గ్యాప్ రావడానికి కారణం అన్నాడు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ప్రేక్షకులకు నచ్చడానికి కారణం, ఆ కథపై నేను చాలా కసరత్తు చేసాను. దాంతో కథలోని కొత్తదనాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని అనిపించింది. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం . అయితే సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేను. నా తాజా చిత్రంగా ‘జాతి రత్నాలు’ రూపొందుతోంది. నాన్ స్టాప్ గా నవ్వించే ఈ సినిమా, నాకు మరో హిట్ ఇస్తుందనే నమ్మకంతో వున్నా,… అన్నాడు .కాగా ఈ ` జాతి రత్నాలు’ చిత్రాన్ని స్వప్న సినిమా బ్యానర్ లో నిర్మించ బోతున్నారు గత సంవత్సరం ” ఛిచ్చోరె ” హిందీ చిత్రం తో బాలీవుడ్ లోకి కూడా ఎంటరై సూపర్ సక్సెస్ అందుకొన్న నవీన్ పోలిశెట్టి సినిమాల విషయం లో చాలా సెలెక్టివ్ గా వెళుతున్నాడని తెలుస్తోంది .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular