పైసా వసూల్ సినిమా నుంచి వరుసగా అయిదు ప్లాప్ చిత్రాలను చవి చూసిన నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న ఉద్దేశం తో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణం గా ఆగింది. కాగా ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర అఘోరా గెటప్ లో ఉంటుందట .. దరిమిలా ఆ పాత్ర కోసం కొన్ని సన్నివేశాలను వారణాసి (కాశీ ) లో చిత్రీకరించాలనుకున్నారు.
వలస కూలీల పెద్ద మనసుకి హాట్సాప్!
కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా కాశీ ప్రయాణానికి పుల్ స్టాప్ పెట్టారు. బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ని మార్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే షూటింగ్ చేయాలనుకుంటున్నాడు. `సింహా, లెజెండ్ ` చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వస్తున్నహ్యాట్రిక్ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రాన్ని` జయ జానకి నాయక ` ఫేమ్ ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ ఫై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Coronas blow to balakrishna boyapati shooting location
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com