Bhole: పల్లవి ప్రశాంత్ జైలు పాలు అయ్యాక ఎవ్వరూ చేయలేని పని చేసిన భోలే షావలి.. శభాష్..!

పల్లవి ప్రశాంత్ యోగక్షేమాలు పోలీసులను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టి విజయం సాధించాడు. బిగ్ బాస్ ప్రమాదకరమైన గేమ్. నేను పాట మాత్రమే పాడాను.

Written By: NARESH, Updated On : December 21, 2023 2:52 pm
Follow us on

Bhole: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. టైటిల్ గెలిచి వారం కూడా గడవక ముందే జైలు పాలయ్యాడు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడిని స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మేజిస్ట్రేట్ పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. కాగా అంతకు ముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడని తెలిసి… భోలే షావలి అక్కడకు వచ్చాడు.

పల్లవి ప్రశాంత్ యోగక్షేమాలు పోలీసులను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టి విజయం సాధించాడు. బిగ్ బాస్ ప్రమాదకరమైన గేమ్. నేను పాట మాత్రమే పాడాను. పల్లవి ప్రశాంత్ ఆట ఆడాడు. ఒకసారి ఛాతి మీద దెబ్బ తగిలితే నాకు ఏమన్నా అవుతుందా అన్నా అని అడిగాడు.

Also Read: డంకి మూవీ ఫుల్ రివ్యూ

పల్లవి ప్రశాంత్ కి ఏమీ తెలియదు. అతడు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్నాడని కూడా అవగాహన లేదు. తన కోసం ఫ్యాన్స్ వచ్చారు అనే ఆనందంలో అలా చేశాడు. అత్యుత్సాహంతో జరిగిన పొరపాట్లు తప్పితే కావాలని చేసింది కాదు. అందరూ పల్లవి ప్రశాంత్ బయటకు రావాలని కోరుకోండి. సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళాలి, అన్నారు. పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడే క్రమంలో ఆయన కళ్ళు చెమర్చాయి.

పల్లవి ప్రశాంత్ కోసం దండం పెట్టి వేడుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాయర్లు ప్రయత్నం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు. డిసెంబర్ 17 ఫైనల్ కాగా పల్లవి ప్రశాంత్ ని కలిసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. ఈ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ పై పలు సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు.