Lok Sabha Election: 10 రాష్ట్రాలు.. 96 స్థానాలు.. నాలుగో దశ ఎన్నికలకు సిద్ధం!

తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు ఒకే రోజు పోలింగ్‌ జరుగుతుంది. తెలంగాణలో 17 స్థానాలకు 525 మంది పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది పోటీలో ఉన్నారు.

Written By: Raj Shekar, Updated On : May 12, 2024 8:32 am

Lok Sabha Election

Follow us on

Lok Sabha Election: పార్లమెంటు ఎన్నికల ప్రక్రియలో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్‌ ముగిసింది. నాలుగో దశ ఎన్నికలు సోమవారం(మే 13న) జరుగనున్నాయి. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. నాలుగో దశ ఎన్నికలు జరిగే 10 రాష్ట్రాల్లోని 96 స్థానాల్లో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

బరిలో 1,717 మంది..
నాలుగో దశలో 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. ఈ స్థానాల్లో మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఒడిశా, పశి‍్చమబెంగాల్‌, జమ్మూకశ్మీర్‌ రాస్ట్రాల్లో ఈ 96 స్థానాలు ఉన్నాయి. వీటికి మే 13న పోలింగ్‌ జరుగుతుంది.

రాష్ట్రాల వారీగా పోటీ ఇలా…
తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు ఒకే రోజు పోలింగ్‌ జరుగుతుంది. తెలంగాణలో 17 స్థానాలకు 525 మంది పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది పోటీలో ఉన్నారు. బిహార్‌లోని 5 స్థానాలకు 55 మంది పోటీ పడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి 24 మంది బరిలో ఉన్నారు. జార‍్ఖండ్‌లోని 4 స్థానాలకు 45 మంది, మధ్యప్రదేశ్‌లోని 8 స్థానాలకు 74 మంది, మహారాష్ట్రలోని 11 స్థానాలకు 209 మంది, ఒడిశాలోని 4 స్థానాలకు 37 మంది, ఉత‍్తర ప్రదేశ్‌లోని 13 స్థానాలకు 130 మంది, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాలకు 75 మంది పోటీ పడుతున్నారు.

బరిలో ఉన్న ప్రముఖులు వీరే..
నాలుగో దశలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు ​క్రికెటర్లు, ఒక నటుడు మొత్తం 1,7171 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల్లో పోలింగ్‌ 65 శాతానికి మించలేదు. ఈ నేపథ్యంలో నాలుగో విడతలో పోలింగ్‌ పెంపునకు ఈసీ చర్యలు చేపట్టింది. వాతారణం కూడా చల్లబడడంతో పోలింగ్‌ ఈసారి 70 శాతానికిపైగా నమోదవుతుందని వెల్లడించారు.