Crime News : చనిపోయేముందు అఖిల రాసిన ఉత్తరంలో ఏముందంటే..

Akhila కానీ అఖిల్ మాత్రం ఒక చెడ్డ జ్ఞాపకంగానే గుర్తుండిపోతాడని.. తాను జీవితంలో ఓ పాఠం నేర్పించాడంటూ రాసుకొచ్చింది అఖిల.

Written By: NARESH, Updated On : May 31, 2024 8:38 pm

Akhila Suicide Note

Follow us on

Crime News : హైదరాబాద్ శివారులో జరిగిన సంఘటన ఎంతో మందిని కలవరపెడుతుంది. ఈ విషయం ఇప్పుడు చర్చగా సాగుతోంది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న న్యూ ఎల్బీనగర్ లో, బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల నివసిస్తున్నారు. అఖిల వయసు 22 సంవత్సరాలు కాగా ఈమె ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. మే 28వ తేదీన రాత్రి సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలింది అఖిల. దీనికి ప్రేమనే కారణం అని టాక్.

అయితే అఖిలని, పోరగంటి ప్రాంతానికి చెందిన అఖిల్ సాయి గౌడ్ అనే అబ్బాయి ప్రేమించాడట. తన ప్రేమను ఒప్పుకోకపోతే చంపేస్తాను అంటూ అఖిలను బెదిరించాడట. ఆయన మాటలకు భయపడిన అఖిల అఖిల్ ప్రేమని ఒప్పుకుందట.  ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పి పెద్దలను ఒప్పించారట. కానీ ఆ తర్వాతనే సీన్ మారిందట.

అఖిల్, అఖిలని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అఖిల్ వల్ల అఖిల చాలా సమస్యలు ఎదుర్కొందని..రోడ్ మీద అఖిలని ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. ఫోన్ లో కూడా ఇబ్బంది కర మాటలు మాట్లాడేవాడని అఖిల కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అఖిల్ ని మందలించారు. మొత్తం మీద కొన్ని కొన్ని సంవత్సరాలు నడిచింది వీరి ప్రేమ. చివరకు అఖిల్ పెళ్లికి నిరాకరించాడట.

ఈ విషయం తెలుసుకున్న అఖిల బాధపడి ఇలాంటి నిర్ణయం తీసుకుందట టాక్. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అఖిల చనిపోయే ముందు ఆరు పేజీల ఉత్తరం రాసిందట. ఈ లెటర్ లో, “నేను నిన్ను చనిపోయేంతవరకు గుర్తుపెట్టుకుంటానని..కానీ అఖిల్ మాత్రం ఒక చెడ్డ జ్ఞాపకంగానే గుర్తుండిపోతాడని.. తాను జీవితంలో ఓ పాఠం నేర్పించాడంటూ రాసుకొచ్చింది అఖిల.