spot_img
Homeక్రైమ్‌Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసు.. భర్తను చం** భార్యకు బెయిల్..

Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసు.. భర్తను చం** భార్యకు బెయిల్..

Meghalaya Honeymoon Case: సరిగ్గా గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మేఘాలయ హనీమూన్ కేసు. ఈ వ్యవహారంలో తన భర్తను ప్రేమికుడితో కలిసి చంపేసింది సోనం అనే యువతి. ఆ తర్వాత అనేక రకాలుగా డ్రామాలు ఆడింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. అయితే ఇప్పుడు ఈమెకు సంబంధించిన ఒక వార్త మరోసారి జాతీయ మీడియాలో ప్రధానంగా కనిపించింది.

శుక్రవారం సోనం కు సంబంధించిన బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు లో వాదనలు జరిగాయి. విచారణ నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కాస్త గందరగోళం ఏర్పడింది. ముందుగా బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ కేసులో సోనం బెయిల్ మీద బయటకు వచ్చింది. దీంతో సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. ఆమె బెయిల్ మీద ఇప్పటికీ బయటనే ఉన్నందున.. ఆ విషయంలో తాము జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి చెందిన రాజా రఘువంశీని గత ఏడాది మే 11న సోనం వివాహం చేసుకుంది. నూతన దంపతులు మే 20న మేఘాలయ ప్రాంతానికి హనీమూన్ వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరూ కనిపించలేదు. ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఫలితంగా వారు పోలీసులను ఆశ్రయించారు.

రఘు వంశీ అదృశ్యమైన 11 రోజుల అనంతరం అతడి మృతదేహాన్ని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అతడి దేహం మీద కత్తి పోట్లు ఉన్నాయి. అనంతరం పోలీసులు సోనం కోసం గాలించడం మొదలుపెట్టారు. సరిగ్గా జూన్ ఏడున్న ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజీపూర్ ప్రాంతంలో కనిపించింది.. పోలీసులు విచారించగా ప్రియుడితో కలిసి ఆమె రఘు వంశీని చంపినట్టు తేలింది. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహ… ఇంకా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే సోనం.. మరికొందరికి బెయిల్ వచ్చింది.

సరిగ్గా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో షిల్లాంగ్ కోర్టు సోనం కు బెయిల్ ఇచ్చింది. సెక్షన్లు నమోదు చేయడంలో పోలీసులు తప్పు చేయడం వల్లే ఆమెకు బెయిల్ వచ్చిందని తెలుస్తోంది.. అయితే ఈ బెయిల్ ఇవ్వడాన్ని మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ మెహత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఆమె ఇప్పటికే బెయిల్ మీద విడుదలైన నేపథ్యంలో.. ఇంకా క్రూరంగా ఉండాలని అనుకోవడం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular