Homeక్రైమ్‌Ketan Agarwal Case: సియా చెప్పిన కోటి కాదట..కేతన్ కేసులో 10 కోట్లు.. లాయర్ బయటపెట్టిన...

Ketan Agarwal Case: సియా చెప్పిన కోటి కాదట..కేతన్ కేసులో 10 కోట్లు.. లాయర్ బయటపెట్టిన నిజం..

Ketan Agarwal Case: ఇది మామూలు వ్యవహారం కాదు. రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎక్కడ ఆగుతుందో అర్థం కావడం లేదు. కేసును విచారిస్తున్న పోలీసులకే దిమ్మ తిరిగిపోతోంది. వార్తలు రాస్తున్న మీడియా ప్రతినిధులకు తల బద్దలవుతోంది. మలుపుల మీద మలుపులు.. ఉత్కంఠ మీద ఉత్కంఠ తెలుగు ధారావాహిక లాగా సాగిపోతూనే ఉంది. దీనికి ఎక్కడ ఎండ్ కార్డు పడుతుందో అర్థం కావడం లేదు.

ఇటీవల పూణే నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ అనుమానాస్పద స్థితిలో కోట మీద నుంచి జారిపడి చనిపోయాడు. మొదట్లో ఇతని మరణాన్ని సహజ మరణం అని అనుకున్నారు. ఆ తర్వాత ఇతని మరణం వెనుక కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు ఈ కేసును విచారించడం మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో రకరకాల విషయాలు వెలుగుచూస్తున్నాయి.

తాజాగా ఈ కేసులోకి ప్రముఖ న్యాయవాది ఆశతో శ్రీ వాస్తవ ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఏకంగా సరికొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.. అంతేకాదు 10 కోట్ల వ్యవహారం ఉందని బాంబు పేల్చారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా సోదరుడు సాహిల్ ఇటీవల పోలీసుల విచారణలో కీలక విషయాలను బయటపెట్టారు.. అంతేకాకుండా శ్రీ వాస్తవ అనే లాయర్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు చేసిన వ్యాఖ్యలతో ఆ లాయర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అంతేకాదు 10 కోట్ల పరువు నష్టం నోటీసును సాహిల్ కు పంపించారు.

కోర్టు విచారణ జరగకముందే సియా సోదరుడు సాహిల్ లాయర్ శ్రీ వాస్తవ మీద సంచలన ఆరోపణలు చేశారు. “మేము అతడిని న్యాయవాదిగా నియమించుకోలేదు. మోసపూరితంగా మా సోదరి దగ్గరికి వచ్చాడు. ఆమె దగ్గర నుంచి సంతకం సేకరించాడు. అప్పటినుంచి మమ్మల్ని బెదిరిస్తున్నాడని”శ్రీ వాస్తవను ఉద్దేశించి ఇటీవల సాహిల్ వ్యాఖ్యానించాడు. ఈ ఆరోపణల మీద లాయర్ శ్రీ వాస్తవ ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను సియాను నేరుగానే సంప్రదించాను. ఆమె మేజర్ కాబట్టి నిర్ణయాలు మొత్తం ఇండిపెండెంట్గా తీసుకుంది. లీగల్ హెల్ప్ కోసం వకాలత్ నామా మీద నేరుగాని సంతకం చేసింది. సాహిల్ గురించి ఎన్నడు చర్చించలేదు. అసలు అతనితో మాట్లాడలేదు. నేరుగా సియాతోనే చర్చించాం. అతడు నిరాదరమైన ఆరోపణలు చేస్తున్నాడు. దీనివల్ల నా ప్రతిష్టకు భంగం కలిగింది.. అందువల్లే అతడు నుంచి 10 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతున్నానని” శ్రీ వాస్తవ పేర్కొన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version