Homeక్రైమ్‌Ghaziabad: 30 ఏళ్ల క్రితం అపహరించారు.. ఇన్నాళ్లకు ఇంటికొచ్చిన అతడికి ఎలాంటి అనుభవం ఎదురయిందంటే?

Ghaziabad: 30 ఏళ్ల క్రితం అపహరించారు.. ఇన్నాళ్లకు ఇంటికొచ్చిన అతడికి ఎలాంటి అనుభవం ఎదురయిందంటే?

Ghaziabad: ఆ బాలుడు పేరు రాజు 1993 సెప్టెంబర్ 8న పాఠశాలకు వెళుతుండగా దుండగులు అతని అపహరించారు. అతడు స్కూలుకు వెళ్లే ఘజియాబాద్ ప్రాంతం నుంచి చాలా దూరం తీసుకెళ్లారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో అతడిని బంధించారు. ఆ తర్వాత రోజు కొడుతుండేవారు. రాత్రిపూట కూడా హింసిస్తూ ఉండేవారు.. ఆ తర్వాత అతడు వారి నుంచి తప్పించుకున్నాడు. ఢిల్లీ చేరుకున్నాడు. ఢిల్లీలో ఒకచోట పనికి కుదిరాడు. అలా పని చేసుకుంటూ జీవించడం మొదలుపెట్టాడు. తన పేరు రాజ్ సింగ్ గా మార్చుకున్నాడు. స్థానికంగా ఒక హోటల్ కూడా పెట్టుకున్నాడు. కొంతకాలం అలా పని చేశాడు. జీవితం ఒంటరిగా అనిపించడం.. నా అనే వాళ్లు లేకపోతే జీవితం లేదని భావన కలగడంతో.. తన వాళ్లను వెతుక్కుంటూ వచ్చాడు..

ఈలోగా తన నేపథ్యాన్ని ఖోడా పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత అతడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. చివరికి అతడు ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన దంపతులకు కుమారుడని నిర్ధారించారు. ఆ తర్వాత అతడిని వారికి అప్పగించారు. 30 సంవత్సరాల తర్వాత అపహరణకు గురై.. ఇన్నాళ్లకు ఇంటికి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ కుమారుడు ఇక లేడని.. దుండగులచేతిలో చనిపోయి ఉంటాడని వారు భావించారట. అందువల్లే ప్రతి ఏడాది అతడి చిత్రపటానికి తిథి కార్యాలు నిర్వహిస్తున్నారట. అయితే ఇన్నాళ్లకు తమకుమరుడు తిరిగి రావడంతో వారు నమ్మలేకపోతున్నారు. తమ కుమారుడిని ఇంటిదాకా తీసుకువచ్చిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ” నమ్మలేకపోతున్నాం. మా కుమారుడు బతికి ఉన్నాడంటే ఆశ్చర్యపోతున్నాం. చిన్నప్పుడు కిడ్నాప్ అయ్యాడు. చనిపోయాడని నిర్ధారణకు వచ్చాం. కానీ ఇన్నాళ్లకు బతికి మా ముందుకు వచ్చాడు. మా కుమారుడిని చూస్తే గర్భంగా ఉందని” ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు. తనను కిడ్నాప్ చేసిన ముఠా గురించి పోలీసులకు రాజు చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఖోడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇస్తాను పోలీసులకు సమాచారం అందించి.. వారి ఆట కట్టించే పనిలో పడ్డారు. పాత నేర రికార్డులను పరిశీలిస్తున్నారు. తగిన ఆధారాలతో వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పోలీసులు చెబుతున్నారు. పిల్లలను అపహరించే దుండగుల ఆగడాలను అరికడతామని వివరిస్తున్నారు. చిన్నారులను అపహరించే దుండగుల ఆట కట్టించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తామని.. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పోలీసులు పేర్కొంటున్నారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper