Homeక్రైమ్‌Nagar kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో అమానుషం.. ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఎస్సై.. కారణం...

Nagar kurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో అమానుషం.. ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించిన ఎస్సై.. కారణం ఏంటంటే..

Nagar kurnool: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఈ జిల్లాలోని లింగాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ కొందరు యువకులకు శిరో ముండనం చేయించాడు. ఇది స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎస్సై దగ్గరుండి గుండు కొట్టించడంతో ఓ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆ యువకుడు నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ యువకుడి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లింగాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే విషయంలో యువకులు, బంక్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బ్యాంక్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఆ యువకులను పిలిపించారు.. పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇరు వర్గాలను విచారిస్తుండగా.. ఓ యువకుడు ఎస్ఐ ముందు నిలుచుని తల దువ్వుకున్నాడు. దీంతో ఆ ఎస్ఐ ఆగ్రహంతో రెచ్చిపోయాడు. దీంతో అతనితో పాటు మరో ఇద్దరి యువకులకు కూడా గుండు కొట్టించాడు.

ఎస్సై చేసిన పనితో..

ఎస్ఐ చేసిన పనితో తీవ్రమైన మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు యుద్ధ ప్రాతిపదికన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆ యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గతంగా విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ తో ఇప్పటికే ఒక నివేదిక తెప్పించుకున్నారని సమాచారం.. ఎస్సై అందరి ముందు గుండు కొట్టించడంతో ఆ యువకుడు తీవ్రమైన మనస్థాపానికి గురైనట్టు స్థానికులు చెబుతున్నారు. పైగా అందరూ చూస్తుండగానే గుండు కొట్టించడం అతడిని మనస్థాపానికి గురయ్యాలా చేసిందని.. అందువల్లే అతడు ఆత్మహత్యకు యత్నించాడని చెబుతున్నారు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో ఆ యువకుల తప్పులేదని.. పెట్రోల్ బంక్ నిర్వాహకులే అనవసరంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇంతటి దారుణానికి కారణమయ్యాయని స్థానికులు అంటున్నారు. ఆ యువకుడు ఉరి వేసుకోవడం వల్ల.. గొంతు భాగం వద్ద గాయమైంది. పైగా ఆ తాడు నైలాన్ ది కావడంతో గొంతుకు తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది. ఆ భాగంలో కమిలి పోయింది. శ్వాస సరిగా ఆడక పోవడంతో అంతర్గతంగా అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version