Homeక్రైమ్‌Uppal: సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం.. ఆ తర్వాత అతడు చేసిన పనికి అంతా షాక్..

Uppal: సన్నిహితంగా ఉంటున్న మహిళపై అనుమానం.. ఆ తర్వాత అతడు చేసిన పనికి అంతా షాక్..

Uppal: ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య స్నేహం, ప్రేమ, దాంపత్యం బలపడాలంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే ఆ బంధాలను బలోపేతం చేస్తుంది. ఆ నమ్మకం సడలిపోతే అనుమానాలు మొదలవుతాయి. ఆ తర్వాత అవి దారుణాలకు కారణమవుతాయి.. సరిగ్గా ఇలాంటి సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది.

హైదరాబాదు నగరంలోని రామంతపూర్ డివిజన్ లో వివేక్ నగర్ ప్రాంతంలో ఓ మహిళ (47), ఇదే డివిజన్లోనే శ్రీనగర్ కాలనీలో చంద్రమౌళి (47) ఉంటున్నారు. వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.. నాగోల్ ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు చేశారు..అయితే వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.. కొంతకాలంగా ఇద్దరు తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా శారీరక సుఖం అనుభవిస్తున్నారు.. అయితే ఇటీవల ఆ మహిళ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని చంద్రమౌళికి అనుమానం కలిగింది. కొద్ది నెలలుగా ఆ మహిళ వ్యవహార శైలి లో మార్పులు చోటు చేసుకోవడంతో చంద్రమౌళిలో అనుమానం మరింత బలపడింది.

ఆ మహిళపై కక్ష పెంచుకున్న చంద్రమౌళి.. ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. మాట్లాడే పని ఉందని ఆమెను ఆదివారం అర్ధరాత్రి ఉప్పల్ భగాయత్ తీసుకొచ్చాడు.. అనంతరం వారిద్దరూ ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆమె నిల్చుని ఉండగా.. కారుతో దారుణంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం వెంటనే చంద్రమౌళి ఉప్పల్ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయితే ఆ మహిళకు భర్త, పిల్లలు ఉన్నారని సమాచారం. కొంతకాలంగా భర్త తో విడిగా ఉంటున్నదని తెలుస్తోంది.. ఆ మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. అనంతరం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version