Hyderabad: కళ్ళు చెదిరే డబ్బు ఇస్తారు.. నీలి చిత్రాల్లో నటిస్తావా.. తీరా హోటల్ కు వెళ్లిన ఆ వివాహితను.

ఆమె పేరు (రోజా పేరు మార్చాం) స్వస్థలం విశాఖపట్నం. చూడ్డానికి బాగుంటుంది. పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు. భర్త తాగుడుకు బానిస అయ్యాడు. ఇంటి వ్యవహారాలు పట్టించుకోడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 16, 2024 2:55 pm

Hyderabad

Follow us on

Hyderabad: కట్టుకున్న భర్త తాగుబోతు. ఇంటి యవ్వారం పట్టదు. పైగా కన్న పిల్లలను కూడా చూసుకోడు. ఏ పనీ చేయకపోగా.. తను రెక్కలు ముక్కలు చేసుకొని తెచ్చిన కూలి డబ్బులను తాగుడు కోసం తీసుకెళ్తాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆమెను చితక బాదుతాడు. ఇలా సంవత్సరాలుగా ఆమె బాధ పడుతూనే ఉంది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ.. భర్త తీరు మారలేదు. ఆమె సంసారం కూడా గాడిన పడలేదు. చివరికి ఆమె జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయంటే..

ఆమె పేరు (రోజా పేరు మార్చాం) స్వస్థలం విశాఖపట్నం. చూడ్డానికి బాగుంటుంది. పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు. భర్త తాగుడుకు బానిస అయ్యాడు. ఇంటి వ్యవహారాలు పట్టించుకోడు. దీంతో ఇంటి భారం మొత్తం ఆమె మోస్తోంది. ఉపాధి కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చింది. హైదరాబాదులో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్ల పనులు చూసుకుంటూ ఉపాధి పొందుతోంది. ఈ క్రమంలో ఆమెకు చెన్నకేశవ అనే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అది కాస్త ఇద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధానికి దారితీసింది. “ఎంతకాలం ఈ పనులు.. ఒకసారి గా లక్షాధికారి అయితే బాగుంటుందని” అతడు పదేపదే ఆమె ఎదుట ప్రస్తావించేవాడు. దీనికి ఆమె కూడా “ఏం చేస్తే బాగుంటుందని” అతడిని అడిగేది. ” నా దగ్గర ఒక ఐడియా ఉంది. కాకపోతే అది నువ్వు చేస్తావా?” అని అతడు అనడంతో.. “నేను చేయంది” అంటూ ఉందా? అని ఆమె బదులిచ్చింది. దీంతో అతడు తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాడు. దానికి ఆమె మొదట్లో కుదరదు అని చెప్పింది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఒప్పుకోక తప్పలేదు.

ఇంతకీ చెన్నకేశవ ఆమె ఎదుట తీసుకొచ్చిన ప్రస్తావన ఏంటంటే.. ఒడ్డు, పొడవు, రంగు ఉండడంతో నీలి చిత్రాల్లో నటించాలని ఆమెను కోరాడు. మొదట్లో దీనికి ఆమె ఒప్పుకోకపోయినప్పటికీ.. ఆ తర్వాత ఓకే చెప్పేసింది. తనకు రకరకాల నీలి చిత్రాల వెబ్ సైట్ల వారు తెలుసని.. ఒక్క చిత్రంలో నటిస్తే లక్షలకు లక్షలు ఇస్తారని చెప్పడంతో.. ఆమె ఆశల్లో విహరించింది. ఆమె ఎలాగూ ఒప్పుకోవడంతో.. షూటింగ్ ఉందని చెప్పి అతడు ఆమెను పంజాగుట్టలో ఒక ప్రముఖ హోటల్ కు తీసుకెళ్లాడు. ఇద్దరు అక్కడ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత.. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఆమెకి ఇచ్చాడు. ఆమె మెల్లగా మత్తులోకి జారుకున్న తర్వాత.. ఒంటిపై బట్టలు మొత్తం తీసి ఆమె నగ్నత్వాన్ని వీడియో తీశాడు. ఆ మత్తు నుంచి ఆమె తేరుకున్న తర్వాత.. ఆ వీడియోలను చూపించి చెన్నకేశవ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇస్తేనే ఆ వీడియోలు ఇస్తానని చెప్పడంతో.. భయపడిన బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెన్నకేశవ కోసం గాలిస్తున్నారు. కాగా, బాధితురాలు కొంతకాలంగా తన కుటుంబంతో కలిసి దిల్ సుఖ్ నగర్ లో నివాసం ఉంటోంది.