ఆస్కార్ అవార్డు రేసులో ‘జాతిర‌త్నాలు’!

న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి.. ఈ ముగ్గురి కాంబోలో వ‌చ్చిన జాతి ర‌త్నాలు సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిందో అంద‌రికీ తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం కొల్ల‌గొట్టిన క‌లెక్ష‌న్లు చూసి అంద‌రూ నోరెళ్ల బెట్టారు. ఓవ‌ర్సీస్ లో మిలియ‌న్ డార్లు సాధించి.. క‌రోనా త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముక్కోణ‌పు పోటీలో విడుద‌లైన ఈ చిత్రానికి.. మిగిలిన రెండూ తేలిపోవ‌డంతో ఎదురే లేకుండాపోయింది. గాలిసంప‌త్ డిజాస్ట‌ర్ […]

Written By: Bhaskar, Updated On : April 2, 2021 3:40 pm
Follow us on


న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి.. ఈ ముగ్గురి కాంబోలో వ‌చ్చిన జాతి ర‌త్నాలు సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిందో అంద‌రికీ తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం కొల్ల‌గొట్టిన క‌లెక్ష‌న్లు చూసి అంద‌రూ నోరెళ్ల బెట్టారు. ఓవ‌ర్సీస్ లో మిలియ‌న్ డార్లు సాధించి.. క‌రోనా త‌ర్వాత అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

ముక్కోణ‌పు పోటీలో విడుద‌లైన ఈ చిత్రానికి.. మిగిలిన రెండూ తేలిపోవ‌డంతో ఎదురే లేకుండాపోయింది. గాలిసంప‌త్ డిజాస్ట‌ర్ గా మిగిలిపోగా.. శ్రీకారం యావ‌రేజ్ మూవీగా మిగిలిపోయింది. దీంతో జాతిరత్నాలు దూసుకెళ్లింది. ఆ త‌ర్వాత వారం వ‌చ్చిన మూడు చిత్రాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవ‌డంతో జాతిర‌త్నాల పంట పండింది. కోట్లాది రూపాయ‌లు కొల్ల‌గొట్టింది.

అయితే.. ఓ లేటెస్ట్ న్యూస్ ఆడియ‌న్స్ ను నివ్వెర‌ప‌రిచింది. ఈ చిత్రం ఆస్కార్ కు నామినేట్ అయ్యింద‌ని చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. బెస్ట్ జానే జిగర్ కేట‌గిరీలో అవార్డుకు ఈ మూవీ నామినేట్ అయ్యింద‌ని ప్ర‌క‌టించింది. దీంతో.. సోష‌ల్ మీడియాలో ఈ పోస్టు వైర‌ల్ అయ్యింది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకునే అర్హ‌త‌ ఖ‌చ్చితంగా ఉందంటూ కొంద‌రు కామెంట్ చేశారు.

మ‌రికొందరు మాత్రం.. ఈ మ‌ధ్య‌నే ఆస్కార్ అవార్డులు ప్ర‌క‌టించ‌గా.. ఇప్పుడు నామినేష‌న్లు ఏంటీ? అని అనుమానం వ్య‌క్తంచేశారు. అయితే.. వీరి అనుమాన‌మే నిజ‌మైంది. ఆడియ‌న్స్ ను ఏప్రిల్ ఫూల్ చేసేందుకే ఈ పోస్టును పెట్టిన‌ట్టు త‌ర్వాత తేలింది. దీంతో.. అంద‌రూ న‌వ్వేసుకున్నారు. ఇప్ప‌టికీ సినిమా ప్ర‌మోష‌న్ కొన‌సాగిస్తున్న యూనిట్ ను చూసి ‘వాట్ ఆన్ ఐడియా గురూ!’ అంటున్నారు నెటిజన్లు.