ఫస్ట్‌ లుక్‌ తో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ !

కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నిలబడటానికి ఇంకా కిందామీదా పడుతున్నాడు. పైగా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని కమెడియన్. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా కనిపిస్తూ అలరిస్తూ వస్తున్నాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్‌ రెడ్డి ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు . అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు […]

Written By: admin, Updated On : May 17, 2021 1:35 pm
Follow us on


కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నిలబడటానికి ఇంకా కిందామీదా పడుతున్నాడు. పైగా తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని కమెడియన్. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా కనిపిస్తూ అలరిస్తూ వస్తున్నాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్‌ రెడ్డి ఇప్పుడు ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు .

అభిలాష్‌ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్‌ స్టూడియోస్‌ పతాకంపై అచ్యుత్‌ రామారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్నట్టు అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ రానున్న ఈ మూవీలో శ్రీనివాస్‌ రెడ్డి మెయిన్ లీడ్‌ రోల్‌ చేస్తుండగా, దీక్షిత్‌ శెట్టి (కన్నడ హిట్‌ మూవీ ‘దియా’ ఫేమ్‌), వెన్నెల రామారావు ప్రధాన పాత్రధారులుగా కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. శ్రీనివాస రెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు ఒకే పోస్టర్‌లో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మొత్తానికి నెటిజన్లను మెప్పించింది. కాగా ఈ సినిమా ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ తో రానుందని, పైగా ఈ సినిమాలో అనేక ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ పూర్తయింది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇక నటీనటులు విషయానికి వస్తే.. శ్రీనివాసరెడ్డి, దీక్షిత్‌ శెట్టి (‘దియా’ మూవీ హీరో), వెన్నెల రామారావు, త్విష్‌ శర్మ, శ్వేతా వర్మ, నిజర్, రాజా రవీంద్ర, జెమిని సురేష్, జోష్‌ రవి,బద్రం, సూర్య, జబర్తస్త్‌ సన్నీ తదితరులు నటిస్తున్నారు. డైరెక్టర్‌ అభిలాష్‌ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.