https://oktelugu.com/

కంగనాపై దేశద్రోహం కేసు నమోదు

ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ట్వీట్లు చేశారని బాలీవుడ్‌ నటి కంగానా రానౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి విషయంలో వివాదాస్పద ట్వీట్లు చేసిన ఆమె ముంబైని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌గా పోల్చారు. దీంతో ఈ ట్వీట్లు ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ముంబైలోని బాంద్రా […]

Written By: , Updated On : October 17, 2020 / 03:51 PM IST
Follow us on

ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ట్వీట్లు చేశారని బాలీవుడ్‌ నటి కంగానా రానౌత్‌పై దేశ ద్రోహం కేసు నమోదైంది. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబై కోర్టు ఆదేశించింది. ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి విషయంలో వివాదాస్పద ట్వీట్లు చేసిన ఆమె ముంబైని పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌గా పోల్చారు. దీంతో ఈ ట్వీట్లు ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ముంబైలోని బాంద్రా మెజిస్ట్రేట్‌ మెట్రోపాలి టిన్‌ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో కంగనాపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు.