Xiaomi 17T new smartphone launch: Xiaomi తన సరికొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ సిరీస్లో భాగంగా Xiaomi 17Tని భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఈ షియోమీ నుంచి వినియోగదారులను ఆకట్టుకునే మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు లేటేస్ట్ టెక్నాలజీతోవస్తున్న దీనిపై అంచనాలు ఎక్కువవయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితె..
Xiaomi 17T స్మార్ట్ఫోన్ 6.59-అంగుళాల AMOLED డిస్ప్లేతో రానుంది. ఇది 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్గా ఉంటుంది. దీనికి TÜV రీన్ల్యాండ్ ఐ-కేర్ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీంతో ఇది కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది.ఈ ఫోన్ మీడియాటెక్ యొక్క శక్తివంతమైన Dimensity 8500 Ultra ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ , హై-ఎండ్ పర్ఫార్మెన్స్ను సులభతరం చేస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ పై పనిచేయనుంది.
ఈ స్మార్ట్ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ ఇందులో ఉండే Leica-tuned ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ , 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ పనిచేస్తుంది. ఇది 120x వరకు డిజిటల్ జూమ్ను సపోర్ట్ చేస్తుందని, తద్వారా ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఒక ‘టెలిఫోటో మాస్టర్’గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. Xiaomi 17Tలో 6,500 mAh సామర్థ్యం గల భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందించనున్నారు. ఇది సుదీర్ఘ కాలం పాటు ఫోన్ ఛార్జింగ్ నిలిచి ఉండేలా చేస్తుంది. దీనికి తోడు, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా ఇందులో చేర్చారు. దీనివల్ల తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జ్ అవుతుంది.
షియోమీ 17T స్మార్ట్ఫోన్ భారత్లో జూన్ 04, 2026న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. చాలా కాలం తర్వాత షియోమీ తన ‘T’ సిరీస్ ఫోన్ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకువస్తుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.
