spot_img
Homeబిజినెస్Reserve Bank Of India: ఎకరం 800 కోట్లు.. దేశ ఆర్థిక, రియల్ బూమ్ లో...

Reserve Bank Of India: ఎకరం 800 కోట్లు.. దేశ ఆర్థిక, రియల్ బూమ్ లో ఇదో సంచలనం

Reserve Bank Of India: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం హైదరాబాదులోని కోకాపేట లోని నియో పోలీస్ ప్రాంతంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన వెంచర్ లో భూములను వేలం వేశారు. ఎకరం 100 కోట్లకు విక్రయమైంది. రాజ్ పుష్ప అనే సంస్థ ఆ ఎకరం భూమిని కొనుగోలు చేసింది. అప్పట్లో దానిని సంచలనంగా పేర్కొన్నారు. గులాబీ మీడియా అయితే మహా గొప్పగా రాసింది. చూశారా మా సార్ పరిపాలనలో హైదరాబాద్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందో అన్నట్టుగా డబ్బాలు కొట్టింది. కానీ అందులో ఉన్న డొల్ల ఎలాంటిదో తర్వాత గాని అర్థం కాలేదు.

Also Read: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండుల్కర్.. క్లారిటీ

కోకాపేట విషయాన్ని కాస్త పక్కన పెడితే ముంబైలో ఎకరం ధర 800 కోట్ల వరకు వెళ్లింది. ఇంత ధర వెచ్చించి కొనుగోలు చేసింది రిలయన్స్ ముఖేష్ అంబానీ, టాటా లో, బిర్లాలో కాదు. అంత ధర పెట్టి కొనుగోలు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిజానికి మనదేశంలో అత్యంత ఖరీదైన ప్రాంతాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భవనాలు ఉన్నాయి. అంతకుమించి స్థలాలు కూడా ఉన్నాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలోని నారీమన్ పాయింట్ లో ఉన్న ప్లాట్ కోసం ఏకంగా 34 72 కోట్లు చెల్లించింది. ఈ లెక్కన ఎకరానికి 800 కోట్ల దాకా అయింది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 208 కోట్లు చెల్లించింది. ఇక ఈ ఏడాది మనదేశంలో ఇదే అతిపెద్ద భూ క్రయమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ స్థలం పక్కనే ముంబై హైకోర్టు.. ఇతర కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి.

దేశంలో వివిధ ప్రాంతాలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భవనాలు ఉన్నప్పటికీ.. మారుతున్న అవసరాల ఆధారంగా అతిపెద్ద కార్యాలయాన్ని నిర్మించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నది.. ఇందులో భాగంగానే దేశ ఆర్థిక రాజధానిలో అతి పెద్ద భవనాన్ని నిర్మించనుంది. ఈ ప్రాంతంలో ఎప్పటినుంచి భవన నిర్మాణ పనులు మొదలు పెడుతుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పలేదు. కాకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలో అతిపెద్ద, అత్యంత విలువైన భూమి క్రయం ఇదేనని తెలుస్తోంది.. అయితే ఈ స్థాయిలో నగదు వెచ్చించి భూమిని కొనుగోలు చేయడం వెనక కారణం ఏంటనేది మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Oktelugu Epaper