Tata new cars launch 2026: వినియోగదారులకు అనుగుణంగా మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కార్లు వస్తుంటాయి. అయితే నేటి తరం వారు డిఫరెంట్ ఆలోచనలతో ఉన్నారు. కొందరు సాంప్రదాయ హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని చూస్తే.. మరికొందరు ఎస్ యూవీ కారు కొనాలని అనుకుంటున్నారు. ఇంకొందరు ఎలక్ట్రిక్ కారు కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఓ కంపెనీ మూడు కార్లను తీసుకొస్తుంది. లేటేస్ట్ టెక్నాలజీతో పాటు ఇంజన్ పవర్ ను మరింతగా అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్న ఈ కార్ల గురించి మీకోసం..
దేశంలో అత్యధికంగా కార్లు విక్రయాలు జరుపుకుంటున్న కంపెనీల్లో TATA రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ నుంచి ఎక్కువగా SUVలు మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేవిధంగా ఈ కంపెనీ ఇప్పుడు మూడు డిఫరెంట్ వేరియంట్ల కార్లను తీసుకురాబోతుంది.
టాటా కంపెనీ నుంచి ది బెస్ట్ సెల్లర్ కారుగా నిలిచింది టియాగో. ఈ కారును ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ గా మార్చారు. ఈ కొత్తకారు హెడ్ ల్యాంప్స్ కొత్తగా ఉంటాయి. రీ డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ తో పాటు ఫ్రంట్ గ్రిల్ ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. అలాగే ఇంటీరియర్ ఈ కారులో 19.2 కిలో వాట్ , 24 కిలో వాట్ బ్యాటరీలు ఉండనున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 223 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. నగర ప్రయాణికులతో పాటు లాంగ్ జర్నీ చేసే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. మిగతా ఫీచర్లు ఇప్పటి వరకు ఉన్న టియాగో లాగే ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ కారు కొనాలని అనుకునేవారు ఇప్పుడు దీనిని ఎలక్ట్రిక్ కారుగా పొందవచ్చు. దీనిని దీపావళి కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది.
Also Read: ఈ కారులో గ్యాస్ ఇంజన్ తో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్.. డ్రైవర్లకు ఫుల్ సపోర్ట్..
టాటా నుంచి రాబోతున్నమరో కారు సియెర్రా ఈవీ. ఈ ఏడాది జూన్ లోపల మార్కెట్లోకి రాబోతున్న ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ లో కర్వ్వి ఈవీ, హారియర్ ఈవీతో సమానంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 65 కిలోల పెద్ద బ్యాటరీని అమర్చనున్నారు. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇందులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉండడంతో లాంగ్ జర్నీ చేసేవారికి అనుగుణంగా ఉంటుందని అంటున్నారు.
ప్రీమియం కారు కోసం ఎదురుచూసేవారికి టాటా కంపెనీ గుడ్ న్యూస్ చెబుతోంది. ఈ కంపెనీ నుంచి స్పోర్ట్ లుక్ తో ఎస్ యూవీ కారును తీసుకురాబోతుంది. టాటా అవిన్య ఈవీ పేరుతో రాబోతున్న దీని గురించి ఇప్పటికే ప్రస్తావించబడింది. ఇది టాటా జెన్ 3 ప్లాట్ ఫాం పై తయారు చేయబడుతోంది. ఎలక్ట్రిక్ ఫైడ్ మాడ్యులర్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ కారు ధర రూ.35 లక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
