Homeబిజినెస్Modi Garib Kalyan Anna Yojana Scheme: మీకు ఫ్రీ రేషన్ అందడం లేదా.....

Modi Garib Kalyan Anna Yojana Scheme: మీకు ఫ్రీ రేషన్ అందడం లేదా.. ఏం చేయాలంటే..?

Modi Garib Kalyan Anna Yojana  SchemeModi Garib Kalyan Anna Yojana Scheme: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీమ్స్ లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా లక్షల కుటుంబాలు ఉచితంగా రేషన్ ను పొందుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఎంతోమందికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే.

జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా కేంద్రం 80 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా గతేడాది ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. నవంబర్ నెల వరకు ఈ స్కీమ్ అమలు కానుందని తెలుస్తోంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమకు ఉచిత రేషన్ అందడం లేదని ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం లబ్ధిదారులు ఇంటినుంచే ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ స్కీమ్ కింద ప్రతి వ్యక్తి నెలకు ఐదు కిలోల ఉచిత రేషన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. https://pgportal.gov.in/ వెబ్ సైట్ ద్వారా రేషన్ కు సంబంధించి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు ట్విట్టర్‌ లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఉచిత రేషన్ అందకపోతే మొదట డీలర్ ను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి. డీలర్ నుంచి సరైన స్పందన లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలి.

జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వెళ్లి డీలర్ గురించి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో బియ్యంకు బదులుగా గోధుమలను పంపిణీ చేస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version