spot_img
Homeబిజినెస్Digital Payments: ఫోన్ పే, గూగుల్ పే.. మీ జేబులకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలుసా..

Digital Payments: ఫోన్ పే, గూగుల్ పే.. మీ జేబులకు ఎలా చిల్లు పెడుతున్నాయో తెలుసా..

Digital Payments: ఒకప్పుడు పర్సులో నగదు పెట్టుకుని వెళ్లేవాళ్ళు. ఏవైనా ఖర్చులకు ఆ డబ్బులను చెల్లించేవాళ్ళు. ఒకవేళ జేబులో డబ్బులు లేకపోతే వాటిని కొనుగోలు చేసేవారు కాదు. అత్యవసరం అనుకుంటే అప్పు తీసుకొచ్చి ఆ వస్తువులు కొనుగోలు చేసేవారు.. ఆ తర్వాత అప్పులు తీర్చేవారు. ఇదంతా ఒక పద్ధతి. అందువల్లే చాలా కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వం కొనసాగుతూ ఉండేది.

ఇప్పుడు జేబులో డబ్బు లేకపోయినా పర్వాలేదు. కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అవసరాలు తీర్చుకోవచ్చు. హోటల్లో తాగే టీ నుంచి.. విమానంలో చేసే ప్రయాణం వరకు ప్రతిదీ కూడా డిజిటల్ పేమెంట్ల ద్వారానే సాగిపోతోంది.. కొన్ని సందర్భాలలో డబ్బు ఎంతైనా పర్వాలేదు జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. అందువల్లే నేటి యువతరం నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు అందరూ కూడా డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. మారిన కాలానికి డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడటం సరైనదే అయినప్పటికీ.. దీనివల్ల మనకు తెలియకుండానే జేబులకు చిల్లుపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

“ఆన్లైన్ విధానంలో జరిగే చెల్లింపులు మన జీవితాలను అత్యంత సులభతరం చేశాయి. అయితే ఇలాంటి ఈజీ చెల్లింపులకు అలవాటు పడటం వల్ల తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతున్నాయి. నగదు నోట్లను లెక్కించినప్పుడు చాలామంది ఇంత ఖర్చు పెడుతున్నామా అనుకునేవారు. అందువల్లే చేసే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టడానికి ప్రధాన కారణం డిజిటల్ పేమెంట్ యాప్స్. వీటి ద్వారా డబ్బు చెల్లింపు సులభతరం కావడం.. డబ్బు తీసుకోవడం కూడా ఈజీ కావడంతో చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుంచి 30 వరకు చెల్లించిన చెల్లింపులు ఒకసారి లెక్కిస్తే మనకు పెట్టిన ఖర్చు అర్థం అవుతుందని” ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఖర్చుపెట్టిన నగదు కంటికి కనిపించకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంద ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇటీవల ఆర్థిక నిపుణులు మనదేశంలో కొన్ని ప్రాంతాలలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడుతున్నారు. చెల్లింపులను వీటి ద్వారానే చేస్తున్నారు. అందువల్ల చేసిన ఖర్చు అర్థం కావడం లేదు. నగదు ఎలాగైతే వస్తున్నదో.. అంతకంటే వేగంగా ఖర్చవుతుంది. అందువల్లే నెల చివర్లో ఎవరి వద్ద కూడా డబ్బులు ఉండడం లేదని.. సాధ్యమైనంతవరకు ఖర్చులను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version