Homeబిజినెస్Mahindra Car Price : వినియోగదారులకు షాక్ ఇచ్చిన మహీంద్రా కార్ల కంపెనీ.. 

Mahindra Car Price : వినియోగదారులకు షాక్ ఇచ్చిన మహీంద్రా కార్ల కంపెనీ.. 

Mahindra Car Price :కార్ల దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎస్ యూవీ కార్లలో విభిన్న మోడల్ ను తీసుకొచ్చి సంచలనాలు సృష్టించింది. హైబ్రిడ్ ఇంజిన్లను కలిగి.. రేసు గుర్రంలా దూసుకుపోయే మహీంద్రా కార్లంటే వినియోగదారులు ఎక్కువగా లైక్ చేస్తారు. అయితే ఈ కంపెనీ తాజాగా వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొన్ని మోడళ్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో మహీంద్రా కారు కొనాలనుకునేవారు ధరలు పెరగడం చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఏ మోడల్ పై ఎంత ధర పెంచారో చూద్దాం..
మహీంద్రా నుంచి రిలీజ్ అయిన థార్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అందరికీ తెలిసింది. ఈ మోడల్ కు ఎన్ని కార్లు పోటీ వచ్చినా థార్ కు ఉండే ప్రాధాన్యత తగ్గడం లేదు. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.10.98 లక్షలు ఉంది. టాప్ వేరియంట్ రూ.16.93 లక్షలకు అమ్మారు. ఇప్పుడు  ప్రారంభ ధరను  11.25 లక్షల వరకు పెంచి టాప్ ఎండింగ్ ను రూ.17.20 లక్షలతో విక్రయించనున్నారు. ఇదే మోడల్ ఇతర వేరియంట్ లో ఓవరాల్ గా రూ.23 వేల నుంచి రూ.35 వేల వరకు పెరిగింది.
మహీంద్రా XUV 700 AX7: ఈ మోడల్ పై మొత్తంగా రూ.57,000 గరిష్టంగా పెంచారు. దీంతో ప్రస్తుతం ఈ కారు 23.69 లక్షలతో విక్రయించనున్నారు. ఇందులో ప్రధానంగా ముందు సీట్ల తో వెంటిలేటర్లు, ORVM మెమరీ ఫంక్షన్ అందుబాటులో ఉంది. స్కార్పియో ఎన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ.34,000  నుంచి రూ.39,000 వరకు పెరిగింది. అలాగే స్కార్పియో ఆటోమేటిక్ వేరియంట్ రూ.17,000 నుంచి రూ.20,000 వరకు పెంచారు.
ప్రస్తుతం స్కార్పియో ధర రూ.13.60 లక్షల ధర ఉండగా దీనిని రూ.17.35 లక్షల వరకు పెంచారు. డీజిల్ వెర్షన్ మోడల్ రూ.39,000 వరకు పెంచారు.  డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ రూ.11,000 నుంచి రూ.26,000 వరకు పెంచారు. స్కార్పియో ఎన్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ.34,000 నుంచి రూ.39,000 వరకు పెరిగింది. ఎన్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ను రూ.17,000 నుంచి రూ.20,000 వరకు పెంచారు. కాగా స్కార్పియో Z87 3WD డీజిల్ మాన్యువల్ పై ఎటువంటి మార్పులు లేవు.
అయితే మహీంద్రా కార్ల ధరలు పెరగడంతో పాటు కొన్నింటికి తగ్గించింది.  మహీంద్రా మరో మోడల్ XUV 700 ధర రూ.14.03 లక్షలు ఉండగా ప్రస్తుతం  రూ.13.99 లక్షలతో విక్రయించనుంది. మహీంద్రా XUV700 AS, AX 5 వేరియంట్ లు వరుసగా రూ.8,000 నుంచి రూ.16,000 వరకు తగ్గించారు.
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper