Homeబిజినెస్గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా డిస్కౌంట్..?

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా డిస్కౌంట్..?

ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయలకు పైగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఈ వాలెట్ సంస్థ పేటీఎం గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది.

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై పేటీఎం ఏకంగా 900 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది. సిలిండర్ బుకింగ్ చేసుకునే వాళ్లకు ఈ బంపర్ ఆఫర్ వల్ల ఊరట కలగనుంది. అయితే ఈ ఆఫర్ ను అందరూ పొందడం సాధ్యం కాదు. ఎవరైతే పేటీఎం ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది. 900 రూపాయల లోపు ఎంతైనా క్యాష్ బ్యాక్ లభించే అవకాశం అయితే ఉంటుంది.

గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకున్న 24 గంటల లోపు ఈ క్యాష్ బ్యాక్ డబ్బులు లభించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఆఫర్ ను పొందాలని అనుకుంటారో వారు పేటీఎం యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

పేటీఎం తీసుకొచ్చిన ఈ ఆఫర్ వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలగనుందని చెప్పవచ్చు. పేటీఎం యాప్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఆఫర్ ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version