Homeబిజినెస్Govt of India: రైతులకు అదిరిపోయే తీపికబురు చెప్పిన మోదీ సర్కార్?

Govt of India: రైతులకు అదిరిపోయే తీపికబురు చెప్పిన మోదీ సర్కార్?

Govt of IndiaGovt of India: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు మరో తీపికబురు అందించింది. రబీ పంటలకు కేంద్రం భారీస్థాయిలో మద్దతు ధరను పెంచింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధరల విషయంలో ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వేర్వేరు పంటలకు 40 రూపాయల నుంచి 400 రూపాయల వరకు మద్దతు ధరలను పెంచినట్టు తెలుస్తోంది.

మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 2022 – 2023 మార్కెటింగ్ సీజ‌న్‌లో రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచడానికి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రైతులు పంటల సాగులో వైవిధ్యం ప్రదర్శించాలని అన్ని రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరను ప్రకటించింది.

గోధుమలు, బార్లీ, శనగలు, చెరకు, ఆవాలపై కేంద్రం మద్దతు ధరలను పెంచగా 2022 – 23 మార్కెటింగ్ సీజన్ లో ఈ ధరలు వర్తిస్తాయి. రేప్‌సీడ్‌లు, ఆవాల పంటకు ప్రతి క్వింటాల్‌కు రూ. 400 చొప్పున కేంద్రం మద్దతు ధర పెంచింది. క్వింటాల్ చెరకు మద్దతు ధరను కేంద్రం 290 రూపాయలు పెంచింది. గోధుమలపై రూ.40, బార్లీ రూ.35 , శనగలపై రూ.350 కేంద్రం మద్దతు ధరను పెంచడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్-సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అన్నదాతల ఆదాయాన్ని పెంచడంతో పాటు అదనపు ఉపాధిని కల్పించాలని కేంద్రం భావిస్తుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version