Gold Price Today In Hyderabad: బంగారం, వెండి ధరల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపించాయి. బంగారం ధరలు తగ్గింపు కనిపించగా.. వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, ద్రవ్యోల్బణ భయాలు, బలమైన డాలర్ వంటి కారణాల వల్ల పసిడి ధరలలో స్వల్ప తగ్గుదల కనిపిస్తుండగా, వెండి ధరలు మాత్రం పెరుగుదల బాటలో పయనిస్తున్నాయి. మనదేశంలో ధరల ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ.440 పతనమై రూ.1,59,490 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 తగ్గి రూ.1,46,200గా నమోదైంది. అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు మరియు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న సందిగ్ధత కారణంగా పసిడిపై ఒత్తిడి నెలకొంది.
బంగారానికి భిన్నంగా వెండి ధరల్లో మాత్రం జోరు కనిపిస్తోంది. నేడు హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,95,000కు చేరింది. పారిశ్రామిక అవసరాల కోసం పెరుగుతున్న డిమాండ్, గ్లోబల్ మార్కెట్లోని అస్థిరతల వల్ల వెండి ధరలు ఊగిసలాటను ప్రదర్శిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలలో కనిపిస్తున్న ఈ హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తున్నాయి.
మధ్య ప్రాచ్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం ప్రస్తుతం బంగారం, వెండి ధరలపై ఎక్కువగా ఉంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలు బులియన్ మార్కెట్పై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. బలమైన అమెరికా డాలర్ విలువ కూడా విలువైన లోహాల ధరల మీద ఒత్తిడిని పెంచుతోంది.
అయితే ఈ ధరలు కేవలం సూచికలు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు, మేకింగ్ ఛార్జీలు, పన్నులు మరియు ఇతర స్థానిక మార్కెట్ పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ రేట్లను సరిచూసుకోవడం ఉత్తమం.
